Share News

Viveka Case: వివేకా కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

ABN , Publish Date - Apr 23 , 2024 | 09:04 PM

మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య (Vivekananda Reddy Case), పెండింగ్ కేసులపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అప్పీల్ వేశారు. ఇదే అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టును వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే.

 Viveka Case: వివేకా కేసు విచారణను రేపటికి వాయిదా వేసిన హైకోర్టు

అమరావతి: మాజీమంత్రి వివేకానంద రెడ్డి హత్య (Vivekananda Reddy Case), పెండింగ్ కేసులపై ఎవరూ మాట్లాడవద్దని కడప కోర్ట్ ఇచ్చిన తీర్పుపై ఏపీ హైకోర్టు (AP High Court)లో తెలుగుదేశం పార్టీ నేత బీటెక్ రవి అప్పీల్ వేశారు. ఇదే అంశంపై మంగళవారం ఏపీ హైకోర్టును వివేకా కుమార్తె డాక్టర్ సునీతారెడ్డి ఆశ్రయించిన విషయం తెలిసిందే. అప్పీల్‌ను లంచ్ మోషన్ రూపంలో సీనియర్ న్యాయవాది ఉన్నం మురళీధర్ వేసిన విషయం తెలిసిందే.


AP Election 2024: వలంటీర్లకు ఆ బాధ్యతలు అప్పగించొద్దు.. సీఈఓ మీనాకు కూటమి నేతల వినతి

రేపు(బుధవారం) ఉదయం విచారణ చేపడుతామని ధర్మాసనం పేర్కొంది. తొలుత ఈ పిటిషన్‌ను తాను విచారించలేనని , రేపు మరో ధర్మాసనం విచారణ చేపడుతుందని బెంచ్ పేర్కొంది. కడప కోర్టు ఇచ్చిన ఉత్తర్వులు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 కు , పత్రికా స్వేచ్ఛకు వ్యతిరేకమని పిటిషన్‌లో తెలిపారు. ఇటీవల సుప్రీంకోర్టు ధర్మాసనం బ్లూమ్ బర్గ్ కేస్‌లో ఇచ్చిన తీర్పుకు కూడా పూర్తి విరుద్ధమని న్యాయవాది పేర్కొన్నారు. ప్రతివాదులు లేకుండా ఉత్తర్వులు జారీ చేయకూడదని ఉన్నం మురళీధర్ పిటీషన్‌లో వివరించారు. పిటిషన్‌పై విచారణను హైకోర్టు రేపటికి వాయిదా వేసింది.


AP Election 2024: ఈ సైకోను చూస్తే గొడ్డలి గుర్తుకొస్తుంది... జగన్‌పై చంద్రబాబు ఆగ్రహం

Read Latest Andhra pradesh News or Telugu News

Updated Date - Apr 23 , 2024 | 09:55 PM