Share News

TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. అసలు కారణమిదే!

ABN , Publish Date - Mar 06 , 2024 | 09:53 AM

నేడు టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి జనసేన అధినేత పవన్ కల్యాణ్ రానున్నారు. నేడు చంద్రబాబు నివాసంలో రేపు ఢిల్లీ వెళ్లే అంశంపై ఇరు నేతలూ చర్చించుకోనున్నారు. రెండో జాబితా విడుదలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఢిల్లీ వెళ్లి వచ్చిన తర్వాత రెండో జాబితా విడుదల చేయాలా? ఒకవేళ ఢిల్లీ పర్యటన వాయిదా పడితే రెండో జాబితా విడుదల చేద్దామన్న దానిపై చర్చ జరగనుంది.

TDP-Janasena: చంద్రబాబుతో పవన్ భేటీ.. అసలు కారణమిదే!

అమరావతి: నేడు టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు (Chandrababu) నివాసానికి జనసేన (Janasena) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) వెళ్లారు. వీరిద్దరూ రేపు ఢిల్లీ వెళ్లే అంశంపై చర్చించుకోనున్నారు. రెండో జాబితా విడుదలపై కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. పవన్ ఢిల్లీ (Delhi) వెళ్లి వచ్చిన తర్వాత రెండో జాబితా విడుదల చేయాలా? ఒకవేళ ఢిల్లీ పర్యటన వాయిదా పడితే రెండో జాబితా విడుదల చేద్దామన్న దానిపై చర్చ జరగనుంది.

విశాఖకు ‘ఫినిషింగ్‌’ టచ్‌!

నిన్న రాత్రి ఒంటి గంట వరకూ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchennaidu), జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ (Nara Lokesh)తో అభ్యర్థుల జాబితాపై చంద్రబాబు కసరత్తు చేశారు. ఇప్పటికే 94 మందితో టీడీపీ.. ఐదుగురితో జన సేన తొలి జాబితాను ప్రకటించింది. రెండో జాబితాలో తెలుగుదేశం 25 నుంచి 30 సీట్లు.. జనసేన 10 సీట్లు వరకూ ప్రకటించే అవకాశం ఉంది. ఇప్పటికే పొత్తుల కారణంగా సీట్ల సర్దుబాటు, మరి కొంతమంది ఆశావహకులకు సీట్లు ఇవ్వలేక పోయిన సీనియర్లను పిలిచి చంద్రబాబు బుజ్జగించారు.

గొడ్డలి నా చేతిలో కాదు.. జగన్‌, అవినాశ్‌ చేతుల్లో పెట్టాలి

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 06 , 2024 | 11:18 AM