Share News

AP Elections: పేర్ని కిట్టు అనుచరుల వీరంగం.. జనసేన నేత ఇంట్లోకి చొరబడి మహిళలతో..

ABN , Publish Date - May 02 , 2024 | 04:56 PM

Andhrapradesh: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో జోరు పెంచారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఒకేసారి, ఒకే చోట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు..

AP Elections: పేర్ని కిట్టు అనుచరుల వీరంగం.. జనసేన నేత ఇంట్లోకి చొరబడి మహిళలతో..
YSRCP Candidate Perni Kittu

కృష్ణా జిల్లా, మే 2: ఏపీలో ఎన్నికలు (AP Elections 2024) సమీపిస్తున్న తరుణంలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో (Election Campaign) జోరు పెంచారు. అయితే ఎన్నికల ప్రచారాల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అధికార, ప్రతిపక్షాలకు చెందిన అభ్యర్థులు ఒకేసారి, ఒకే చోట ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి. పలు ప్రాంతాల్లో ఇరు పార్టీలకు చెందిన అభ్యర్థుల అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న పరిస్థితులు కనబడుతున్నాయి. తాజాగా కృష్ణా జిల్లా మచిలీపట్నంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. జనసేన నేత నివాసంపై వైసీపీ అభ్యర్థి అనుచురుల దాడికి పాల్పడటంతో పరిస్థితి రణరంగంగా మారింది.

AP Elections: ఎన్నికల వేళ ఉద్యోగులకు.. జగన్ సర్కార్‌ దిమ్మతిరిగే షాక్!


మచిలీపట్నంలో జనసేన నేత కర్రి మహేష్ ఇంటిపై వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు (YSRCP Candidate Parni Kittu) అనుచరుల దాడి పాల్పడ్డారు. గురువారం వైసీపీ అభ్యర్థి పేర్ని కిట్టు విశ్వ బ్రాహ్మణ కాలనీలో ఎన్నికల ప్రచారానికి వచ్చారు. ఈ క్రమంలోజనసేన నేత కర్రి మహేష్ ఇంటి ముందు పేర్ని కిట్టు అనుచరులు పెద్ద ఎత్తున బాణా సంచా కాల్చి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు. ఇదంటని ప్రశ్నించడంతో పేర్ని కిట్టు అనుచులు రెచ్చిపోయారు. ఏకంగా కర్రి మహేష్ ఇంట్లోకి చొరబడి ఆడవాళ్ల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించారు. దీంతో ఇరువర్గాల మధ్య వాగ్వివాదం, తోపులాటకు దారి తీసింది. ఈ ఘటనపై జనసేన నేత పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే పోలీసులు పట్టించుకోకపోవడంతో మచిలీపట్నం పోలీస్ స్టేషన్ వద్ద జనసేన, టీడీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. స్టేషన్ ముందు రోడ్డుపై బైఠాయించి జనసేన, టీడీపీ కార్యకర్తలు నిరసన చేస్తున్నారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: నీవు చస్తే ఎవడైనా విగ్రహం పెడతాడా?..ముద్రగడపై పృథ్వి ఫైర్

Father: తండ్రి కాదు కసాయి.. ఆరేళ్ల బాలుడిని ఏం చేశాడో తెలుసా..?

Read latest AP News And Telugu News

Updated Date - May 02 , 2024 | 05:01 PM