Share News

Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..

ABN , Publish Date - Apr 13 , 2024 | 02:32 PM

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో నాయకులు ఎలక్షన్ ( AP Elections 2024 ) హీట్ పెంచుతున్నారు.

Nara Lokesh: నీ ప్రచారం పిచ్చి తగలెయ్యా.. ఆఖరుకు ఆయన్నూ వదలలేదా..

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. విమర్శలు, ప్రతి విమర్శలతో నాయకులు ఎలక్షన్ ( AP Elections 2024 ) హీట్ పెంచుతున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ ప్రచారంలో కొత్త పుంతలు తొక్కుతున్నారు. ఎలాగైనా విజయం సాధించి తీరాలనే పట్టుదలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్ రెడ్డిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఫైర్ అయ్యారు. ఎక్స్ వేదికగా విమర్శనాస్త్రాలు సంధించారు.


జగన్‌కు బిగ్ షాక్ ఇచ్చిన ఎమ్మెల్యే.. నేరుగా ఆమె వద్దకు వెళ్లి..

రాష్ట్రంలో జగన్ పాలన అన్ని వర్గాలకు అనుకూలంగా ఉందని, ప్రజలు మరోసారి సీఎంగా జగన్ నే అనుకుంటున్నారని వైసీపీ కొత్త ప్రచారం మొదలుపెట్టింది. స్టెచ్చర్ పై ఉన్న వ్యక్తి జగన్ ను చూసేందుకు వచ్చారంటూ పార్టీ శ్రేణులు తెలిపాయి. దీనిపై లోకేశ్ మండిపడ్డారు. నీ ప్రచారం పిచ్చి తగలేయ్యా!.. దిగజారుడు రాజకీయాల్లో నిన్ను కొట్టేవాడు దేశంలోనే లేడని మరోసారి నిరూపించావని మండిపడ్డారు. ఇకనైనా ఈ డ్రామాలు ఆపు జగన్ అంటూ చురకలు అంటించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.

Updated Date - Apr 13 , 2024 | 02:32 PM