Share News

Chandrababu: మారీచుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొందాం.. వైసీపీ కుట్రలను సాగనివ్వం

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:38 AM

Andhrapradesh: వైసీపీకి ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయు అన్నారు. మంగళవారం ఆళ్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత మాట్లాడుతూ... సైకోగాళ్ల కుట్రలు ఉగ్రవాదుల కంటే మించిపోయాయని విమర్శించారు. టీడీపీ - జనసేన - బీజేపీ పొత్త పెట్టుకున్నాయని ఎన్నికల్లో జనసేనను డామేజ్...

Chandrababu: మారీచుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొందాం.. వైసీపీ కుట్రలను సాగనివ్వం
TDP Chief Chandrababu Naidu

నంద్యాల, ఏప్రిల్ 30: వైసీపీకి (YSRCP) ఓటమి భయం పట్టుకుందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. మంగళవారం ఆళ్లూరులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో టీడీపీ అధినేత మాట్లాడుతూ... సైకోగాళ్ల కుట్రలు ఉగ్రవాదుల కంటే మించిపోయాయని విమర్శించారు. టీడీపీ - జనసేన - బీజేపీ పొత్త పెట్టుకున్నాయని ఎన్నికల్లో జనసేనను డామేజ్ చేసేలా 54 నియోజకవర్గాల్లో గ్లాస్ ఫ్లంబర్ గుర్తు స్వతంత్ర అభ్యర్థులకు వచ్చేలా వైసీపీ కుట్రలు చేసిందని ఆరోపించారు.

TS SSC Results: తెలంగాణ ఎస్‌ఎస్‌సీ పరీక్షా ఫలితాలు విడుదల


వైసీపీ వాళ్లు వివిధ వేషాల్లో వచ్చి కన్ఫ్యూజ్ చేస్తారని.. వారి మాటల్ని నమ్మవద్దని కోరారు. మారీచుడు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనే సత్తా ఉందని... వైసీపీ కుట్రలను సాగనివ్వమని స్పష్టం చేశారు. మాండ్ర శివానందరెడ్డికి సముచిత స్థానం కల్పిస్తామన్నారు. నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరిని, నందికొట్కూరు ఎమ్మెల్యే అభ్యర్థి జయసూర్యను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. మళ్లీ నందికొట్కూరు వస్తానని... విజయోత్సవాలు జరుపుకుందామని అధినేత చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

Lok Sabha Polls 2024: ఇద్దరి టార్గెట్ డబుల్ డిజిట్.. పైచేయి ఎవరిది..?

Hyderabad: కాంగ్రెస్‌ 14 సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం..

Read latest AP News And Telugu News

10th ఫలితాల కోసం క్లిక్ చేయండి..

Updated Date - Apr 30 , 2024 | 12:40 PM