Share News

AP Elections 2024: వైసీపీకి గట్టి షాక్: పార్టీ వీడిన డొక్కా, టీడీపీలో చేరిక

ABN , Publish Date - Apr 26 , 2024 | 08:42 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం రాజీనామా చేసి హైదరాబాద్ బయల్దేరారు.

AP Elections 2024: వైసీపీకి గట్టి షాక్: పార్టీ వీడిన డొక్కా, టీడీపీలో చేరిక
Dokka Manikya Vara Prasad

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ముందు అధికార వైసీపీ పార్టీకి గట్టి షాక్ తగిలింది. మాజీ మంత్రి, సీనియర్ నేత డొక్కా మాణిక్య వరప్రసాద్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. ఈ రోజు ఉదయం రాజీనామా చేసి హైదరాబాద్ బయల్దేరారు. హైదరాబాద్‌లో గల చంద్రబాబు నివాసంలో శుక్రవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు. డొక్కా మాణిక్యవర ప్రసాద్‌కు చంద్రబాబు నాయుడు కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. వైసీపీ హైకమాండ్ తీరుతో డొక్కా మాణిక్య వరప్రసాద్ అసంతృప్తితో ఉన్నారు. టికెట్ కేటాయింపు, ప్రాధాన్యం లేకపోవడంతో అంటిముట్టనట్టుగా ఉన్నారు. వైసీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడిగా డొక్కా ఉన్నారు. పార్టీ, సీఎం జగన్ తీరుతో విసుగుచెంది ఈ రోజు ఉదయం రాజీనామా చేశారు. సాయంత్రం తెలుగుదేశం పార్టీలో చేరారు.


Read Latest
Election News or Telugu News

Updated Date - Apr 26 , 2024 | 08:42 PM