Share News

AP Elections: ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో చెప్పేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే...

ABN , Publish Date - Apr 08 , 2024 | 11:10 AM

Andhrapradesh: ఏపీలో ఎన్నికలకు మరికొద్దిరోజులే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. మరోసారి అధికారం తమదే అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈ సారి ఎన్నికల్లో గెలిచి తీరుతామని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ఎన్నికల్లో గెలుపుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి విజయం తథ్యం అంటూ ఆయన జోష్యం చెప్పారు.

AP Elections:  ఏపీ ఎన్నికల్లో విజయం ఎవరిదో చెప్పేసిన కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే...
Former MLA Gone Prakash Rao

పశ్చిమగోదావరి, ఏప్రిల్ 8: ఏపీలో ఎన్నికలకు (AP Elections) మరికొద్దిరోజులే సమయం ఉండటంతో అధికార, ప్రతిపక్ష పార్టీలు పోటాపోటీగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తున్నాయి. మరోసారి అధికారం తమదే అని వైసీపీ ధీమా వ్యక్తం చేస్తుండగా.. ఈ సారి ఎన్నికల్లో గెలిచి తీరుతామని కూటమి నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ఏపీ ఎన్నికల్లో గెలుపుపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాష్ రావు (Former MLA Gone Prakash Rao) చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలలో కూటమి విజయం తథ్యం అంటూ ఆయన జోష్యం చెప్పారు. అలాగే బీజేపీతో (BJP) పొత్తు వలన కూడా కొంత నష్టం ఉందని కూడా అభిప్రాయపడ్డారు.

Kerala Raging: హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం.. బట్టలు విప్పించి నగ్నంగా ఊరేగింపు..


ఇంతకీ గోనె ప్రకాష్ ఏమన్నారంటే...

ఏపీ ఎన్నికల్లో కూటమి 130 నుంచి 145 అసెంబ్లీ స్థానాలు,19 నుంచి 21 పార్లమెంటు స్థానాలు గెలుస్తుందని చెప్పుకొచ్చారు. బీజేపీతో పొత్తు వలన అసెంబ్లీ సీట్లకు కొంత నష్టం ఉందన్నారు. చిత్తూరు, కడప జిల్లాలలో మాత్రమే వైసీపీకి (YSRCP) మెజారిటీ సీట్లు వస్తాయన్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ (Janasena Chief Pavan Kalyan) 50 నుంచి 60 వేల మెజార్టీతో గెలుస్తారని తెలిపారు. చివరి నిమిషంలో పవన్ ఎంపీగా కూడా వెళ్లే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. పవన్ ఎంపీగా నెగ్గితే కేంద్రంలో క్యాబినెట్ మినిస్టర్ అవుతారన్నారు. జనసేనకు (Janasena) ఇచ్చిన సీట్లను కూడా పవన్ రాష్ట్ర భవిష్యత్తు కోసం త్యాగం చేస్తున్నారన్నారు. జగన్ మళ్ళీ అధికారంలోకి వస్తే అరాచకం పెరుగుతుందని.. జగన్ ప్రభుత్వం పోవాలని పవన్ త్యాగం చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే వెల్లడించారు.

goneprakash-ap.jpg

Big Breaking: ఢిల్లీ లిక్కర్ కేసులో కవితకు షాక్..


అలాగే అటు తెలంగాణ పార్లమెంట్ ఎన్నికల్లోనూ (Loksabha Elections) కాంగ్రెస్‌కు (Congress) 8 నుంచి 11, బీజేపీకి 5 నుంచి 6, ఎంఐఎంకు 1, బీఆర్‌ఎస్‌కు (BRS) ఒక్క సీటు రాకపోయినా ఆశ్చర్యపడక్కర్లేదని వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ నియోజకవర్గాల పర్యటనలో భాగంగా ఉండి నియోజకవర్గంలో టీడీపీ ఎమ్మెల్యే రామరాజు (TDP MLA Ramaraju) చేస్తున్న బైక్ ర్యాలీ కార్యక్రమంలో గోనె ప్రకాష్ రావు పాల్గొని ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Elections: కూట‌మి దూకుడు.. వైసీపీ బేజారు..!

AP Elections:చావులతో రాజకీయం.. జగన్‌పై జనం ఆగ్రహం..!

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 08 , 2024 | 11:15 AM