Share News

Devineni Uma: పరాకాష్టకు చేరిన వైసీపీ సర్కార్ ఆకృత్యాలు

ABN , Publish Date - Apr 14 , 2024 | 10:04 PM

వైసీపీ సర్కార్ ఆకృత్యాలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), జనసేన అధినేత (Pawan Kalyan) పై రాళ్లదాడి పిరికిపంద చర్య అని చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు.

Devineni Uma: పరాకాష్టకు చేరిన వైసీపీ సర్కార్ ఆకృత్యాలు

అమరావతి: వైసీపీ సర్కార్ ఆకృత్యాలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు (Devineni Uma Maheswara Rao) మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు(Nara Chandrababu Naidu), జనసేన అధినేత (Pawan Kalyan) పై రాళ్లదాడి పిరికిపంద చర్య అని చెప్పారు. ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఆదివారం నాడు టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ...నిన్న జగన్ రెడ్డి సానుభూతి డ్రామా విఫలమవడంతో దుర్మార్గాలకు తెగబడ్డారని మండిపడ్డారు.


Chandrababu: గాజువాకలో చంద్రబాబు సభలో రాళ్లు విసిరిన ఆకతాయిలు

వ్యవస్థలను గుప్పెట్లో పట్టుకొని ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలోకి నెట్టారని అన్నారు. తప్పులు చేసిన వారు వడ్డీతో సహా మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. మీ దాడులకు టీడీపీ భయపడబోదన్నారు. ఈ ఎన్నికల్లో ప్రజలు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని (YS Jagan Mohan Reddy) ఓటుతో కొట్టి తగిన బుద్ధి చెబుతారని దేవినేని ఉమ హెచ్చరించారు.

TDP: ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది: నారా భువనేశ్వరి

ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 14 , 2024 | 10:19 PM