Share News

AP News: శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్

ABN , Publish Date - Mar 04 , 2024 | 11:19 AM

Andhrapradesh: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. కొందరు వ్యక్తులు డ్రోన్‌ సహాయంలో ఆలయానికి సంబంధించి వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు.

AP News: శ్రీకాళహస్తి ఆలయంపై డ్రోన్

తిరుపతి జిల్లా, మార్చి 4: శ్రీకాళహస్తి ముక్కంటి ఆలయంపై (Srikalahasti Temple) డ్రోన్ ఎగరడం కలకలం రేపింది. కొందరు వ్యక్తులు డ్రోన్‌ సహాయంలో ఆలయానికి సంబంధించి వీడియోలు చిత్రీకరించినట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తమిళనాడుకు చెందిన ఐదుగురు యువకులను అదుపులోకి తీసుకున్నారు. డ్రోన్ కెమెరాలతో తమిళనాడు చెందిన ఐదుగురు యువకులు వీడియోల చిత్రీకరించినట్టు గుర్తించారు. శ్రీకాళహస్తి దేవస్థానం సెక్యూరిటీ.. డ్రోన్ ఎగరవేస్తున్న వాళ్ళని గుర్తించి పోలీసులకు అప్పగించింది. చెన్నైకి చెందిన విఘ్నేష్, అజిత్, కన్నన్, శంకర్ శర్మ, అరవింద్‌లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. అయితే ఆలయంపై డ్రోన్ ఎగరడంపై భక్తులు ఆందోళన చెందారు.

ఇవి కూడా చదవండి..

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలు

Supreme Court: ఎంపీ, ఎమ్మెల్యేలకు లంచం కేసుల్లో సుప్రీంకోర్టు సంచలన తీర్పు



మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 04 , 2024 | 01:12 PM