Home » Srikalahasti
శ్రీకాళహస్తిలో సంచలనంగా మారిన హత్య కేసును తిరుపతి జిల్లా పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి అంతర్రాష్ట్ర నేరచరిత్ర కలిగిన నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు.
శ్రీకాళహస్తిలోని వ్యాసాశ్రమం వివాదం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగారు.
టీడీపీ యువనేత నారా లోకేశ్ పార్టీ శ్రేణుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపుతున్నారు.మరోసారి అదే కార్యక్రమం కోసం నేడు శ్రీకాళహస్తి నియోజకవర్గానికి ఆయన వస్తున్నారు.
శ్రీకాళహస్తీశ్వరాలయ పీఆర్వో కార్యాలయ వ్యవస్థ అక్రమార్కులకు అదునుగా మారిందన్న అభియోగాలు వెల్లువెత్తుతున్నాయి.
భద్రతా వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు హోం మంత్రి అనిత తెలిపారు.శ్రీకాళహస్తిలో సోమవారం టూటౌన్ పోలీస్స్టేషన్ భవనాన్ని మంత్రి సత్యప్రసాద్తో కలిసి ఆమె ప్రారంభించారు.
సాధారణంగా గ్రహణ సమయంలో దేవాలయాలను మూసివేస్తారు. గ్రహణ ప్రభావం దేవుళ్లపై పడుతుందనే కారణంగా ఆలయాలను మూసివేసి.. గ్రహణం ముగిసిన తరువాత అర్చకులు ఆలయాన్ని తెరచి శాస్త్రోక్తంగా శుద్ధి కార్యక్రమాలు చేపడతారు. కానీ, గ్రహణ సమయంలోనూ తెరిచి ఉంచే ప్రసిద్ధ ఆలయం మన ఆంధ్రప్రదేశ్లోనే ఒకటుంది. ఆ ఆలయమేంటో ఈ కథనంలో తెలుసుకుందాం..
మహాశివరాత్రి ఉత్సవాల్లో చివరి రోజైన ఆదివారం రాత్రి జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వరుడికి ఏకాంత సేవను వేడుకగా నిర్వహించారు.
శ్రీకాళహస్తీశ్వర స్వామి, అమ్మవార్లను 200 మంది రష్యన్, జర్మన్ దేశస్తులు దర్శించుకున్నారు. రేణిగుంటలోని శ్రీ రాజరాజేశ్వరి శక్తిపీఠానికి విచ్చేసిన వీరిని.. శక్తిపీఠం పీఠాధిపతి మూర్తి ఆహ్వానించారు..
వారసత్వం, కళాసంపద, ధర్మ పరిరక్షణ.. ఆలయాల చుట్టూనే ఉందని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. నాగరికతకు ఆలయాలు చిహ్నాలని పేర్కొన్నారు. శ్రీకాళహస్తిలో గిరి ప్రదక్షిణను శుక్రవారం వర్చువల్గా ప్రారంభించారాయన.
మహాశివరాత్రి రోజున శ్రీకాళహస్తి ఆలయంలో రాహు కేతు పూజలు చేస్తామంటూ ఇన్స్టాగ్రామ్లో దేవధాం యాప్ పేరుతో ప్రచారం జరిగింది. ఈ వివరాలు సేకరించిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి.. ఆలయ అధికారుల దృష్టికి తీసుకెళ్లింది..