Share News

Akbaruddin Owaisi: ఆయన వల్లే కాంగ్రెస్‌కు దగ్గరయ్యాం

ABN , Publish Date - Dec 16 , 2023 | 02:41 PM

దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి( YSR ) వైఖరి వల్లే మజ్లిస్ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలిపారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ చెప్పారు.

Akbaruddin Owaisi:  ఆయన వల్లే  కాంగ్రెస్‌కు దగ్గరయ్యాం

హైదరాబాద్: దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి( YSR ) వైఖరి వల్లే మజ్లిస్ కాంగ్రెస్‌ పార్టీకి దగ్గరయిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలిపారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని చెప్పారు. ఇమామ్‌లకు రూ.15వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ అభివృద్ధిలో సర్కార్‌కు సహకరిస్తామన్నారు. బీజేపీ, బీఆర్ఎస్‌ మొన్నటి ఎన్నికల్లో ఒక్క ముస్లిం అభ్యర్థిని కూడా గెలిపించుకోలేకపోయాయని చెప్పారు. ఆ రెండు పార్టీలు ముస్లింలను పెద్దగా పట్టించుకోలేదని అక్బరుద్దీన్‌ మండిపడ్డారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Dec 16 , 2023 | 02:50 PM