Home » YSR
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీని వణికిస్తోందనే చర్చ జరుగుతోంది.
కడప లోక్సభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల కడప జిల్లాలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహి స్తున్నారు. దివంగత నేత వైఎస్ వివేకానంద రెడ్డి కుమార్తె డాక్టర్ సునీత కూడా షర్మిలతో ప్రచారంలో పాల్గొంటున్నారు. హంతకులకు సీటు ఇవ్వడం వల్లే తాను కడప లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తున్నట్లు తెలిపారు.
ప్రజలకు జవాబుదారీగా ఉండే ప్రభుత్వం గనులు సహా ఇతర సహజవనరులతో వ్యాపారం చేయాలనుకుంటే లాభాలు ఆశిస్తుంది.
Telangana: ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలన్నదే తమ విధానమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలకు అన్నివిధాలుగా అండగా ఉంటామని స్పష్టం చేశారు. రాజకీయాలు ఎలా ఉన్నా వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారంటూ సీఎం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి ( YSR ) మృతిపై సీఎం జగన్ ( CM JAGAN ) చట్టసభల్లో ఇప్పటివరకు ఎందుకు మాట్లాడట్లేదని ఏపీసీసీ అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు ( Gidugu Rudraraju ) ప్రశ్నించారు. గురువారం నాడు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైఎస్ మరణంపై వైసీపీ నేతలు చేసిన అర్థరహిత ఆరోపణలు సరికాదని అన్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి( YSR ) వైఖరి వల్లే మజ్లిస్ కాంగ్రెస్ పార్టీకి దగ్గరయిందని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ( Akbaruddin Owaisi ) తెలిపారు. శనివారం నాడు అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ... ఇప్పుడున్న ప్రభుత్వం మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలి. పోటీ పరీక్షలను ఉర్దూ మీడియంలో కూడా నిర్వహించాలని ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ చెప్పారు.
అవును.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ను హ్యాట్రిక్ కొట్టకుండా ఓడించాలని ప్రతిపక్ష పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందుకు ఏ చిన్నపాటి అవకాశం వచ్చినా సరే దాన్ని సువర్ణావకాశంగా మలుచుకుని ముందుకెళ్తున్నారు. అంతేకాదు.. కేసీఆర్ పోటీచేస్తున్న కామారెడ్డి, గజ్వేల్ నియోజకవర్గాల్లో సైతం కేసీఆర్ను ఓడించడానికి వ్యూహాత్మకంగా ప్రతిపక్షాలు అడుగులు వేస్తున్నాయి..
సీఎం జగన్ చేతిల్లో మోసపోయిన పేదలకు న్యాయం జరిగే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు(Nimmala Ramanaidu) స్పష్టం చేశారు.
ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి (CM JAGAN REDDY, వైసీపీ ప్రభుత్వం(YCP Govt)పై ట్విట్టర్ వేదికగా బీజేపీ సీనియర్ నేత సత్యకుమార్ ( Satyakumar) ఘాటైన విమర్శలు గుప్పించారు.
తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి(CM Jagan Reddy) 43 వేల కోట్లు దోచుకున్నారని ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్(MP Kanakamedala Ravindra Kumar) ఆరోపించారు.