Raghunandan Rao: సింగరేణిని అమ్మాలని కేసీఆర్ అనుకుంటున్నారు

ABN , First Publish Date - 2023-10-02T22:25:44+05:30 IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే విశ్వాసం.. సీఎం కేసీఆర్‌ అంటే మోసంమని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao) వ్యాఖ్యానించారు.

Raghunandan Rao: సింగరేణిని అమ్మాలని కేసీఆర్ అనుకుంటున్నారు

మంచిర్యాల: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంటే విశ్వాసం.. సీఎం కేసీఆర్‌ అంటే మోసంమని బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు(Raghunandan Rao) వ్యాఖ్యానించారు. సోమవారం నాడు మంచిర్యాలలో పర్యటించారు. ఈసందర్భంగా రఘునందన్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ‘‘సింగరేణిని అమ్మాలని కేసీఆర్ అనుకుంటున్నారు. నిజామాబాద్‌లో కవిత ఓడిపోతే.. కేసీఆర్ కవితకు ఎమ్మెల్సీ పదవి అంటగట్టాడు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారు. సూట్‌కేసులో డబ్బులతో దొరికిన చరిత్ర రేవంత్‌రెడ్డిది. కాంగ్రెస్, బీఆర్ఎస్(BRS) ఒక్కటేనని ప్రజలకు అర్థమవుతోంది.ఎవరెన్ని కుట్రలు చేసినా బీజేపీ విజయాన్ని ఆపలేరు’’ అని రఘునందన్‌రావు పేర్కొన్నారు.

Updated Date - 2023-10-02T22:25:44+05:30 IST