Share News

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్లు.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా..

ABN , First Publish Date - 2023-11-27T07:35:58+05:30 IST

IND vs AUS 2nd T20: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది.

IND vs AUS: చరిత్ర సృష్టించిన టీమిండియా బ్యాటర్లు.. టీ20 క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా..

తిరువనంతపురం: ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20 మ్యాచ్‌లో టీమిండియా టాపార్డర్ బ్యాటర్లు యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ హాఫ్ సెంచరీలతో చెలరేగారు. వీరి విధ్వంసంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 235 పరుగుల భారీ స్కోర్ సాధించింది. 9 ఫోర్లు, 2 సిక్సులతో యశస్వి జైస్వాల్ 25 బంతుల్లోనే 53 పరుగులు చేయగా.. 3 ఫోర్లు, 4 సిక్సులతో ఇషాన్ కిషన్ 32 బంతుల్లోనే 52 పరుగులు చేశాడు. అలాగే 3 ఫోర్లు, 2 సిక్సులతో రుతురాజ్ గైక్వాడ్ 43 బంతుల్లోనే 58 పరుగులు చేశాడు. ఈ క్రమంలో టీమిండియా చరిత్ర సృష్టించింది. టీ20 క్రికెట్ చరిత్రలో మొట్టమొదటిసారిగా మన జట్టు టాప్ 3 బ్యాటర్లు 50+ స్కోర్లు సాధించడం విశేషం. ఈ రికార్డు సాధించిన టీమిండియా బ్యాటర్లుగా యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, ఇషాన్ కిషన్ నిలిచారు. గతంలో ఎంతో మంది సీనియర్లు అందుకోలేని ఈ ఘనతను కుర్రాళ్లు అందుకోవడం గమనార్హం. అలాగే ఓపెనర్లు చెలరేగడంతో పవర్ ప్లేలోనే మన జట్టు 77/1 పరుగులు సాధించింది. దీంతో టీ20 క్రికెట్‌లో పవర్‌ప్లేలో ఆస్ట్రేలియాపై టీమిండియా తన అత్యధిక స్కోర్‌ను నమోదు చేసింది. ఈ క్రమంలో గతంలో 2016లో సాధించిన 74/1 రికార్డు బ్రేక్ అయింది.


ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే ఆదివారం ఆస్ట్రేలియాతో జరిగిన రెండో టీ20లో భారత్‌ 44 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భారత్‌.. రుతురాజ్‌ గైక్వాడ్‌ (43 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లతో 58), యశస్వీ జైస్వాల్‌ (25 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 53), ఇషాన్‌ కిషన్‌ (32 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ధాటికి 20 ఓవర్లలో 4 వికెట్లకు 235 పరుగులు చేసింది. ఎల్లి్‌సకు మూడు వికెట్లు దక్కాయి. భారత బౌలర్లు సమష్టిగా చెలరేగడంతో భారీ ఛేదనలో ఆసీస్‌ 20 ఓవర్లలో 9 వికెట్లకు 191 పరుగులకే పరిమితమైంది. స్టొయినిస్‌ (25 బంతుల్లో 2 ఫోర్లు 4 సిక్సర్లతో 45), మాథ్యూ వేడ్‌ (23 బంతుల్లో ఓ ఫోర్‌, 4 సిక్సర్లతో 42 నాటౌట్‌), టిమ్‌ డేవిడ్‌ (22 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 37) ఫర్వాలేదనిపించారు. రవి బిష్ణోయ్‌, ప్రసిద్ధ్‌లకు మూడేసి వికెట్లు లభించాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా యశస్వీ జైస్వాల్‌ నిలిచాడు. ఈ గెలుపుతో ఐదు టీ20ల సిరీస్‌లో భారత్‌ ఆధిక్యం 2-0కి చేరింది.

Updated Date - 2023-11-27T07:36:00+05:30 IST