Share News

World cup: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియా తుది జట్టు ఇదే!

ABN , First Publish Date - 2023-11-02T13:45:57+05:30 IST

భారత్‌తో మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ కుశల్ మెండీస్ హెడ్స్ చెప్పాడు.

World cup: టాస్ గెలిచిన శ్రీలంక.. టీమిండియా తుది జట్టు ఇదే!

ముంబై: భారత్‌తో మ్యాచ్‌లో శ్రీలంక టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా మొదటగా బ్యాటింగ్ ఎంచుకుంది. టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కాయిన్ వేయగా.. శ్రీలంక కెప్టెన్ కుశల్ మెండీస్ హెడ్స్ చెప్పాడు. కాయిన్ హెడ్స్ పడడంతో టాస్ గెలిచిన శ్రీలంక కెప్టెన్ కుశల్ మెండీస్ మొదట ఫీల్డింగ్ చేస్తామని చెప్పాడు. ఈ మ్యాచ్‌లో శ్రీలంక తమ తుది జట్టులో ఒక మార్పు చేసింది. కాగా అతిథ్య భారత్ జట్టు మాత్రం తమ తుది జట్టులో ఎలాంటి మార్పు చేయలేదు. గత మ్యాచ్‌లో ఆడిన జట్టుతోనే ఈ సారి కూడా బరిలోకి దిగుతోంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు 6 మ్యాచ్‌లు ఆడిన భారత్ అన్నీ గెలిచింది. 12 పాయింట్లతో పాయింట్స్ టేబుల్‌లో రెండో స్థానంలో ఉంది. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటివరకు ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు భారత్ మాత్రమే. ఈ మ్యాచ్‌లోనూ గెలిస్తే టీమిండియా సెమీ ఫైనల్ బెర్త్ ఖరారు అవుతుంది. ఇప్పటివరకు 6 మ్యాచ్‌లాడి రెండు మాత్రమే గెలిచిన శ్రీలంకకు ఈ మ్యాచ్‌ చావో రేవో లాంటింది. ఈ మ్యాచ్‌లో ఓడితే లంక సెమీస్ అవకాశాలు దాదాపుగా ముగిసిపోతాయి.


తుది జట్లు

భారత్: రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్

శ్రీలంక: పాతుమ్ నిస్సాంక, దిముత్ కరుణరత్నే, కుశల్ మెండిస్(వికెట్ కీపర్/కెప్టెన్), సదీర సమరవిక్రమ, చరిత్ అసలంక, ఏంజెలో మాథ్యూస్, దుషన్ హేమంత, మహేశ్ తీక్షణ, కసున్ రజిత, దుష్మంత చమీర, దిల్షన్ మధుశంక

గత రికార్డులు

వన్డే ప్రపంచకప్ చరిత్రలో భారత్, శ్రీలంక ఇప్పటివరకు 9 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. రెండు జట్లు నాలుగేసి సార్లు గెలిచాయి. అయితే ఒక మ్యాచ్‌లో ఫలితం తేలలేదు. ఇరు జట్ల మధ్య పోటీలో అత్యధిక స్కోర్ సాధించిన రికార్డు భారత్ పేరు మీదనే ఉంది. భారత్ 373 పరుగులు చేసింది. అత్యల్ప స్కోర్ శ్రీలంక పేరు మీద ఉంది. లంక 109 పరుగులు చేసింది. ప్రపంచకప్‌లో రెండు జట్ల మధ్య జరిగిన గత 5 మ్యాచ్‌ల్లో టీమిండియా ఏకంగా 4 సార్లు గెలిచింది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే భారత్, శ్రీలంక జట్లు ఇదే మైదానంలో 2011 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్‌లో తలపడ్డాయి. ఆ మ్యాచ్‌లో లంకను భారత్ ఓడించింది. వన్డే ప్రపంచకప్‌లో టీమిండియాను శ్రీలంక చివరగా 2007లో ఓడించింది. మొత్తంగా చూసుకుంటే రెండు జట్ల మధ్య వన్డే ఫార్మాట్లో ఇప్పటివరకు 167 మ్యాచ్‌లు జరిగాయి. అత్యధికంగా టీమిండియా 98 మ్యాచ్‌లు గెలవగా.. శ్రీలంక 57 మ్యాచ్‌ల్లో గెలిచింది.

Updated Date - 2023-11-02T13:48:52+05:30 IST