Home » ODI World Cup
గతేడాది అక్టోబర్లో జరిగిన ప్రపంచకప్లో పసికూన అఫ్గానిస్తాన్ సాధించిన సంచలన విజయాలు క్రికెట్ ప్రేమికులను నివ్వెరపరిచాయి. ఆస్ట్రేలియా మీద గెలిచినంత పని చేసి ఓడిన అఫ్గానిస్తాన్.. పాకిస్తాన్ మీద సునాయాసంగా గెలిచేసింది. ఇంగ్లండ్పై కూడా విజయం సాధించింది.
చూస్తుండగానే 2023 సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. అప్పుడే 12 నెలలు గడిచిపోయాయా? అనే అనుమానం వస్తుంది. కానీ గడిచిపోయాయి. ఇది నిజం. నూతన సంవత్సరం 2024 ఆరంభానికి కూడా సమయం ఆసన్నమైంది.
Rohit Sharma: ప్రపంచకప్ ఫైనల్లో ఓటమి తర్వాత రోహిత్ తొలిసారిగా సోషల్ మీడియాతో మాట్లాడాడు. ప్రపంచకప్లో వరుసగా 10 విజయాలు సాధించిన తర్వాత ఫైనల్లో ఓటమి చెందడం అందరినీ కలిచివేసింది. ఈ నేపథ్యంలో ఫైనల్లో ఓటమి తర్వాత మళ్లీ ఎలా స్టేడియంలోకి అడుగుపెట్టాలో తెలియడం లేదని కెప్టెన్ రోహిత్ శర్మ వీడియోలో తన బాధను వ్యక్తం చేశాడు.
టీమిండియా మ్యాచ్లను ప్రసారం చేసేందుకు స్టార్ గ్రూప్తో పోటీ పడి హక్కులు దక్కించుకున్న జియో సినిమా వ్యూయర్ షిప్లో రికార్డులు క్రియేట్ చేస్తోంది. ఐపీఎల్ తరహాలో సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరుగుతున్న ఐదు టీ20ల సిరీస్ను ఉచితంగా స్ట్రీమింగ్ చేస్తోంది. దీంతో జియో సినిమాను చూసేందుకు క్రికెట్ ప్రేమికులు ఇష్టపడుతున్నారు. అయితే తిరువనంతపురం వేదికగా ఆదివారం భారత్-ఆస్ట్రేలియా మధ్య జరిగిన రెండో టీ20 మ్యాచ్ను ఏకంగా 15 కోట్ల మంది చూశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది.
Team india: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీ ఫైనల్లో ఓడిపోయిన తమకు ప్రధాని మోదీతో పాటు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కూడా ఎంతో మద్దతుగా నిలిచారని.. వారి పట్ల ఎప్పటికీ కృతజ్ఞులుగా ఉంటామని పేర్కొన్నాడు. నిజానికి ప్రపంచకప్లో తమ ప్రదర్శన చాలా సంతృప్తి ఇచ్చిందని. .ఈ జోష్తో వచ్చే ఏడాది జూన్లో జరిగే టీ20 ప్రపంచకప్లో గెలిచి తీరుతామని సూర్యకుమార్ యాదవ్ స్పష్టం చేశాడు.
Team india: ఆస్ట్రేలియా మీడియా సంస్థకు చెందిన సోషల్ మీడియాలో టీమిండియాను అవమానపరుస్తూ ఓ ఫోటో పోస్ట్ చేసింది. South Australia Man Gives Birth To World Record 11 Sons అంటూ ఆ పోస్టుకు క్యాప్షన్ పెట్టింది. ఈ ఫోటోలో ప్రపంచకప్ ఫైనల్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచిన ట్రావిస్ హెడ్ను డెలవరీ రూంలో బెడ్పై పడుకున్న తల్లిగా చూపిస్తూ పిల్లలకు టీమిండియా క్రికెటర్ల ఫోటోలను మార్ఫింగ్ చేయడం వివాదానికి దారి తీసింది.
ఈ ఏడాది ఆస్ట్రేలియా అందరినీ ఆశ్చర్యపరుస్తూ రెండు ఐసీసీ ట్రోఫీలను సాధించింది. ఐసీసీ టెస్ట్ ఛాంపియన్ షిప్తో పాటు వన్డే ప్రపంచకప్ ట్రోఫీలను ఆస్ట్రేలియా తన ఖాతాలో వేసుకుంది. అయితే ఐసీసీ ర్యాంకుల్లో ఆస్ట్రేలియాకు చెందిన ఆటగాళ్లు నంబర్వన్ పొజిషన్లో ఒకరు కూడా లేరు. దీంతో నంబర్వన్ ర్యాంకులు లేకుండా నంబర్వన్గా నిలిచిన ఆస్ట్రేలియాను అందరూ ప్రశంసిస్తున్నారు.
ODI World Cup: ప్రపంచకప్ లాంటి మెగా టోర్నీలో భారత్లో భారత్ను ఓడించడం సామాన్య విషయం కాదని.. ఆస్ట్రేలియాకు ఐపీఎల్ కారణంగానే ఇది సాధ్యమైందని అందరూ చర్చించుకుంటున్నారు. తాజాగా టీమిండియా స్టార్ బౌలర్, సీనియర్ ఆటగాడు రవిచంద్రన్ అశ్విన్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
Team India: టీమిండియా వైస్ కెప్టెన్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ సోషల్ మీడియా వేదికగా ఓ భావోద్వేగ పోస్ట్ పెట్టడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ‘స్టిల్ హర్ట్స్’ అంటూ ఒక్క ముక్కలో తన ఆవేదన గురించి కేఎల్ రాహుల్ రాసుకొచ్చాడు. అంటే ఇంకా ఓటమి బాధిస్తోందని అతడు చెప్పకనే చెప్పాడు.
ODI World Cup: అయితే ప్రపంచకప్లో సూర్యకుమార్ చెత్తగా ఆడాడంటూ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ భట్ విమర్శలు చేశాడు. అసలు ఫైనల్ మ్యాచ్లో సూర్యకుమార్ ఆలోచనా విధానం తనను ఆశ్చర్యపరిచిందని.. అతడు ఎలా ఆడాలని భావించాడో తెలియలేదని పేర్కొన్నాడు.