Wife: ఎన్నిసార్లు భర్తకు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్తే కనిపించిందో లేఖ.. భర్త రాసిందేని గ్రహించి అంతా చదివిన ఆ భార్యకు..

ABN , First Publish Date - 2023-04-22T18:12:26+05:30 IST

అప్పటివరకూ అత్తగారింట్లో భార్యా, పిల్లలతో సంతోషంగా గడిపిన భర్త.. అర్జంట్ పనుందంటూ భార్యను అక్కడే వదిలి సొంతూరికి వెళ్లాడు. మరుసటి రోజు భార్య వచ్చి చూడగా తలుపులకు తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భర్త నుంచి రెస్పాన్స్ రాలేదు. చివరకు..

Wife: ఎన్నిసార్లు భర్తకు ఫోన్ చేసినా నో రెస్పాన్స్.. తాళం పగలగొట్టి ఇంట్లోకి వెళ్తే కనిపించిందో లేఖ.. భర్త రాసిందేని గ్రహించి అంతా చదివిన ఆ భార్యకు..

అప్పటివరకూ అత్తగారింట్లో భార్యా, పిల్లలతో సంతోషంగా గడిపిన భర్త.. అర్జంట్ పనుందంటూ భార్యను అక్కడే వదిలి సొంతూరికి వెళ్లాడు. మరుసటి రోజు భార్య వచ్చి చూడగా తలుపులకు తాళం వేసి ఉంది. ఎన్నిసార్లు ఫోన్ చేసినా భర్త నుంచి రెస్పాన్స్ రాలేదు. చివరకు అంతా కలిసి తాళం పగులగొట్టి లోపలికి వెళ్లగా ఇంట్లో ఓ లేఖ కనిపించింది. భర్త రాసి వెళ్లిన ఆ లేఖ చూసిన భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) సోన్‌భద్రలోని అన్పర పరిధి ఠాగూర్ నగర్ వార్డుకు చెందిన జైచంద్ అనే వ్యక్తికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. జైచంద్ ఓ ప్రైవేట్ కంపెనీలో (private company) పని చేస్తూ జీవనం సాగించేవాడు. అలాగే కారు కూడా నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. ఈ దంపతుల (couple) మధ్య ఎలాంటి సమస్యలూ లేకపోవడంతో వీరి సంసారం సంతోషంగా సాగేది. అయితే ఇటీవల వీరి కుటంబంలో అనుకోని సమస్య వచ్చి పడింది. శుభకార్యం ఉండడంతో జైచంద్ మంగళవారం తన భార్య, పిల్లలను తీసుకుని మీర్జాపూర్ వెళ్లాడు.

Viral Video: విమానాల్లోంచి కిందకు దూకేసిన 105 మంది వృద్ధులు.. పక్కా ప్లాన్‌తో అంతా 5 విమానాల్లో వెళ్లి మరీ..!

అనంతరం గురువారం అటునుంచి అత్తగారింటికి వెళ్లాడు. అక్కడ కొద్ది సేపు గడిపి.. భార్య, పిల్లలను అక్కడే ఉంచి, పనుందంటూ ఒక్కడే సొంతూరికి వెళ్లాడు. గురువారం సాయంత్రం భార్యకు ఫోన్ చేసి.. ‘‘నాకు రక్తపు వాంతులు అవుతున్నాయి. కరోనా (Corona) లక్షణాలు కూడా కనిపిస్తున్నాయి’’.. అని చెప్పాడు. దీంతో ‘‘నేను ఇంటికి వచ్చాక.. ఇద్దరం కలిసి ఆస్పత్రికి వెళ్దాం’’.. అని ఆమె బదులిచ్చింది. శుక్రవారం ఆమె ఇంటికి చేరుకోగా తాళం వేసి ఉంది. భర్తకు ఫోన్ చేయగా ఇంట్లో రింగ్ అవుతున్నట్లు వినిపించింది. చివరకు చుట్టుపక్కల వారంతా కలిసి తలుపులు బద్దలుకొట్టి చూడగా ఇంట్లో అతను కనిపించలేదు.

OYO Rooms: ఓయో రూమ్‌ నుంచి ఓ యువతి ఏడుపులు.. హోటల్‌లో పనిచేసే యువకుడికి డౌట్.. వెళ్లి అడిగితే ఆమె చెప్పింది విని..

మంచంపై ఓ లెటర్ (Letter) రాసి ఉండడాన్ని గమనించారు. అందులో ‘‘రేఖా ఐ లవ్ యూ సో మచ్. నీ కోసం నా ప్రాణం కూడా ఇవ్వగలను. నాకు కరోనా ఉంది. మీ ప్రాణాన్ని ప్రమాదంలో పెట్టడం ఇష్టం లేదు. అందుకే చనిపోవాలని అనుకుంటున్నాను’’.. అని రాసి ఉంది. ఈ లెటర్ చూడగానే జైచంద్ భార్య ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. చుట్టుపక్కల వారు పోలీసులకు ఫోన్ చేసి సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. జైచంద్ కోసం గాలిస్తున్నారు.

Viral News: ప్రియుడితో కలిసి దిగిన ఫొటోను పోస్ట్ చేస్తూ అసలు నిజం బయటపెట్టిన ప్రేయసి.. అవాక్కవుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-04-22T18:12:26+05:30 IST