ఆరేళ్ల పాప చెప్పింది విని.. వంటింట్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల తల్లి చేసిన నిర్వాకం చూసి అంతా షాక్..

ABN , First Publish Date - 2023-03-17T19:38:11+05:30 IST

ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడినా.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంది. అయితే భార్య కారణంగా వారికి ఊహించని సమస్యలు వచ్చి పడ్డాయి. ఎవరికీ చెప్పొద్దంటూ కూతురికి చెప్పి.. ఏ తల్లీ, ఏ భార్యా చేయకూడని..

ఆరేళ్ల పాప చెప్పింది విని.. వంటింట్లోకి వెళ్లిన పోలీసులు.. లోపల తల్లి చేసిన నిర్వాకం చూసి అంతా షాక్..
ప్రతీకాత్మక చిత్రం

ఒకప్పుడు ఆర్థిక సమస్యలతో ఇబ్బందులు పడినా.. ప్రస్తుతం ఇద్దరు పిల్లలతో ఆ కుటుంబం ఎంతో సంతోషంగా జీవిస్తూ ఉంది. అయితే భార్య కారణంగా వారికి ఊహించని సమస్యలు వచ్చి పడ్డాయి. ఎవరికీ చెప్పొద్దంటూ కూతురికి చెప్పి.. ఏ తల్లీ, ఏ భార్యా చేయకూడని పని చేసింది. అయితే ఇటీవల వారి ఆరేళ్ల పాప చెప్పడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. దీంతో చివరకు పోలీసులు వెళ్లి.. వారి వంటింట్లో చూడగా.. షాకింగ్ దృశ్యం కనిపించింది. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

ఉత్తరప్రదేశ్ (Uttar Pradesh) గోండాకు చెందిన రెయిస్ షేక్ అనే వ్యక్తికి షాహిదా అనే యువతితో (young woman) 2012లో వివాహమైంది. పెళ్లికి ముందు రెయిస్.. చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తూ ఉండేవాడు. దీంతో జీతం కూడా తక్కువగా వస్తూ ఉండేది. వివాహమైన తర్వాత ఈ దంపతులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులూ ఉండేవి కావు. అయితే అనంతర కాలంలో వీరికి ఇద్దరు పిల్లలు పుట్టారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్లు అయ్యే కొద్దీ ఖర్చులు పెరిగిపోయాయి. దీంతో అతడికి వచ్చే జీతం ఏమాత్రం సరిపోయేది కాదు. ఒక్కోసారి ఇల్లు గడవడం కూడా కష్టమయ్యేది. ఈ క్రమంలో స్నేహితుల సలహాతో ముంబైలో (Mumbai) ఉద్యోగం కోసం వెళ్లాడు. ముంబైలోని దహిసర్ అనే ప్రాంతంలో దుస్తుల దుకాణంలో సేల్స్‌మెన్‍‌గా (Salesman) చేరాడు.

ముంబైలో మంచి జీతం ఇస్తుండడంతో అందులో తన ఖర్చులకు పోనూ మిగతా డబ్బులను ఇంటికి పంపించేవాడు. అయితే కుటుంబాన్ని కూడా తన వద్దకే తీసుకురావాలని ఇటీవల నిర్ణయించుకున్నాడు. భార్య, పిల్లలను తన వద్దే ఉంచుకుని సంతోషంగా చూసుకోవాలన్న రెయిస్ ఆలోచన.. చివరకు అతడి ప్రాణాల మీదకు వస్తుందని ఎవరూ ఊహించలేకపోయారు. అనుకున్నట్లే భార్య, పిల్లలను తన వద్దకే తెచ్చుకున్నాడు. అక్కడికి వచ్చిన కొన్నాళ్లకు షాహిదాకు తన పొరుగున ఉండే అమిత్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. మొదట్లో భర్త ఉన్నప్పుడు మాత్రమే ఇంట్లోకి వచ్చే అమిత్.. రాను రాను రెయిస్ లేని సమయంలో కూడా వచ్చి వెళ్తుండేవాడు.

రైల్వే స్టేషన్‌లో డ్రమ్.. ఎవరూ తీసుకెళ్లకపోవడంతో సిబ్బందికి డౌట్.. అసలు అందులో ఏముందా అని ఓపెన్ చేసి చూస్తే..

ఇలా కొన్నాళ్లకు షాహిదాకు అతడితో వివాహేతర సంబంధం (extramarital affair) ఏర్పడింది. అప్పటి నుంచి భర్త లేనప్పుడల్లా అతడితో రాసలీలలు సాగించేది. పిల్లల ఎదురుగానే ఇద్దరూ బరితెగించి ప్రవర్తించేవారు. ఎవరికీ చెప్పొందంటూ పిల్లలకు భయం పెట్టడంతో మిన్నకుండిపోయేవారు. అయితే ఓ రోజు రెయిస్ ఇంటికి రాగానే లోపల తన భార్య, ప్రియుడితో పట్టుబడింది. దీంతో అప్పటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల ఈ గొడవలు ఇంకా ఎక్కువయ్యాయి. దీంతో ఎలాగైనా భర్త అడ్డు తొలగించుకోవాలని భార్య, ఆమె ప్రియుడు ప్లాన్ వేశారు. 2021 మే 21న రాత్రి భర్తపై కత్తితో దాడి చేసి హత్య చేసింది.

Onion Peels: ఈ నిజాలు తెలిస్తే ఉల్లిపాయ పొట్టును ఇకపై అస్సలు పడేయరు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఏడు లాభాలు..!

అనంతరం ప్రియుడితో కలిసి భర్త శవాన్ని ముక్కలు చేసి, వంటింట్లో పాతి పెట్టింది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దంటూ పిల్లలను హెచ్చరించింది. తర్వాత తన భర్త బయటికి వెళ్లి తిరిగి రాలేదంటూ పోలీసలకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే ఇటీవల ఓ రోజు రెయిస్ ఆరేళ్ల కూతురు.. తన తండ్రి బంధువులతో అసలు విషయం చెప్పింది. చివరకు పోలీసులు వారి వంటింట్లో తవ్వి చూడగా.. రెయిస్ మృతదేహం బయటపడింది. కేసు నమోదు చేసిన పోలీసులు.. రెయిస్ భార్యను, ఆమె ప్రియుడిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral Video: వామ్మో! వీడేంటీ.. విషసర్పాలను ఇలా ఏరిపారేస్తున్నాడు.. నడి రోడ్డుపై ఇతడు చేసిన పని చూస్తే..

Updated Date - 2023-03-17T19:44:20+05:30 IST