దారి మధ్యలో భార్య బంధువులు తారసపడడంతో కారు ఆపిన యువకుడు.. చివరకు నడి రోడ్డుపై అంతా కలిసి..

ABN , First Publish Date - 2023-03-21T18:51:55+05:30 IST

కొందరు మనసులో కుట్ర నింపుకొన్నా.. పైకి మాత్రం ఎంతో అమాయకుల్లా కనిపిస్తుంటారు. వీరిని నమ్మిన వారిని చివరికి దారుణంగా మోసం చేస్తుంటారు. కొందరు అంతటితో ఆగకుండా దాడులు, హత్యలకు తెగబడుతుంటారు. ప్రేమ వ్యవహారాల్లో..

దారి మధ్యలో భార్య బంధువులు తారసపడడంతో కారు ఆపిన యువకుడు.. చివరకు నడి రోడ్డుపై అంతా కలిసి..
ప్రతీకాత్మక చిత్రం

కొందరు మనసులో కుట్ర నింపుకొన్నా.. పైకి మాత్రం ఎంతో అమాయకుల్లా కనిపిస్తుంటారు. వీరిని నమ్మిన వారిని చివరికి దారుణంగా మోసం చేస్తుంటారు. కొందరు అంతటితో ఆగకుండా దాడులు, హత్యలకు తెగబడుతుంటారు. ప్రేమ వ్యవహారాల్లో ఇలాంటి ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటాయి. తాజాగా, తమిళనాడులో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఓ యువకుడు కారులో వెళ్తుండగా దారి మధ్యలో భార్య బంధువులు తారసపడ్డారు. దీంతో వెంటనే కారును ఆపాడు. అయితే చివరకు జరిగిన దారుణం చూసి అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

తమిళనాడు చెన్నై (Chennai) కృష్ణగిరి పరిధి ధర్మపురి జాతీయ రహదారి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. కృష్ణగిరి జిల్లా (Krishnagiri District) కిట్టంబట్టి గ్రామానికి చెందిన జగన్ (28) స్థానికంగా.. టైల్స్ పని (Tiles business) చేస్తూ జీవనం సాగించేవాడు. ఈ క్రమంలో అతడికి స్థానిక అవధానపట్టి సమీపంలోని తులక్కన్ కోటాయి ప్రాంతానికి చెందిన శంకర్ కుమార్తె శరణ్యతో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కొన్నాళ్లకు ప్రేమగా (love) మారింది. ఇంట్లో తెలీకుండా ఇద్దరూ తరచూ కలుస్తూ ఉండేవారు. చివరకు ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. నెల రోజుల క్రితం ఇంట్లో వాళ్లకు తెలీకుండా పెళ్లి (love marriage) చేసుకున్నారు. ఈ విషయం తెలియగానే యువతి కుటుంబ సభ్యులు.. తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

Super Splendor: ఏ బైక్‌కు అయినా రెండే కదా.. దీనికేంటి మూడు టైర్లున్నాయని అవాక్కవుతున్నారా..? ఈ కుర్రాడు దీన్నెలా మార్చేశాడో మీరే చూడండి..!

letest-crime-news.jpg

తమ ఇష్టం లేకుండా ఎవరో యువకుడిని తమ కూతురు పెళ్లి చేసుకోవడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు. ఎలాగైనా ప్రతీకారం తీర్చుకోవాలని వేచి చూస్తుండేవారు. ఈ క్రమంలో జగన్ మంగళవారం టైల్స్ పని మీద వేరే ప్రాంతానికి బయలుదేరాడు. ధర్మపురి జాతీయ రహదారి వద్దకు రాగానే.. భార్య బంధువులు కారుకు ఎదరుపడ్డారు. భార్య బంధువులే కావడంతో యువకుడు కూడా కారును ఆపాడు. జగన్‌ను బయటికి ఈడ్చుకెళ్లిన వారు (Assault on youth) .. నడి రోడ్డుపైనే గొంతు కోసి హత్య చేశారు. అతను చనిపోయాడని నిర్ధారించుకున్న అనంతరం అక్కడి నుంచి పరారయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు. యువకుడి హత్యతో గ్రామంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Wife: ఓ చిన్న ట్రిక్‌తో నా భార్య రూ.25 వేలు నాకు సేవ్ చేసిందంటూ ఓ భర్త పోస్ట్.. ఫన్నీ కామెంట్స్‌తో సెటైర్లు పేల్చుతున్న నెటిజన్లు..!

Updated Date - 2023-03-21T18:51:55+05:30 IST