Shocking: ఊరి చివర యువతి శవం.. అత్యాచారం చేసి చంపారనుకున్న పోలీసులు.. కేసులో ఆధారాలు లేక ఆ తల్లిని నిలదీస్తే షాకింగ్ ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-05-04T19:27:37+05:30 IST

ఓ ఊరి చివర బావిలో యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి చనిపోయిన తీరు చూసి.. ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారేమో అని అనుకున్నారు. అయితే..

Shocking: ఊరి చివర యువతి శవం.. అత్యాచారం చేసి చంపారనుకున్న పోలీసులు.. కేసులో ఆధారాలు లేక ఆ తల్లిని నిలదీస్తే షాకింగ్ ట్విస్ట్..!
ప్రతీకాత్మక చిత్రం

ఓ ఊరి చివర బావిలో యువతి మృతదేహాన్ని చూసిన స్థానికులు.. పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు యువతి చనిపోయిన తీరు చూసి.. ఎవరైనా అత్యాచారం చేసి హత్య చేశారేమో అని అనుకున్నారు. అయితే ఎంత విచారించినా అందుకు తగ్గ ఆధారాలు వారికి లభించలేదు. దీంతో చివరకు మృతురాలి తల్లిపై అనుమానం వచ్చి అదుపులోకి తీసుకుని విచారించారు. ఆమె చెప్పింది విని అంతా షాక్ అయ్యారు. ఇంతకీ అసలు ఏం జరిగిందంటే..

రాజస్థాన్ (Rajasthan) అజ్మీర్ జిల్లా శ్రీనగర్ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన శాంతి అనే మహిళకు కొడుకు హనీఫ్, కూతురు సోనీ (25) ఉన్నారు. ఇలా వుండగా, శాంతి తన కూతరు సోనీకి చిన్నతనంలోనే ఇదే ప్రాంతానికి చెందిన వ్యక్తితో బాల్య వివాహం (child marriage) చేసింది. 18 ఏళ్లు నిండాక అత్తగారింటికి పంపించాలని అనుకున్నారు. అయితే మేజర్ అయిన కూతురికి చిన్నతనంలో చేసుకున్న వ్యక్తిపై ఇష్టం లేదు. దీంతో అతడి ఇంటికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో తల్లి శాంతి చాలా సార్లు కూతురుకు నచ్చజెప్పాలని చూసింది.

Viral News: ఈ వయసులో ఫేషియల్ ఏంటి తాతా.. అని సెలూన్‌లో కుర్రాళ్ల ఎటకారం.. కట్ చేస్తే వధువు పక్కన పెళ్లిపీటలపై వరుడి స్థానంలో..!

అయినా సోనూ మాత్రం అందుకు నిరాకరించింది. ఈ క్రమంలో సోనూ మరో యువకుడిపై ప్రేమ (Love with a young man) పెంచుకుంది. రోజూ అతడితో మాట్లాడుతూ ఉండేది. అతన్నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయం ఇటీవల తల్లికి తెలిసింది. ఎలాగైనా తాను చెప్పిన వ్యక్తినే వివాహ చేసుకోవాలని చెప్పింది. ఈ విషయంలో తరచూ ఇద్దరి మధ్య గొడవలు (Quarrels between mother and daughter) జరుగుతుండేవి. ఇటీవల కూతురు తన ప్రియుడితో ఫోన్లలో ఎక్కువగా మాట్లాడటం చూసి తల్లికి కోపం కట్టలు తెంచుకుంది. చివరకు షాకింగ్ నిర్ణయం తీసుకుంది.

Viral News: ఫైవ్‌స్టార్ హోటల్‌లో గుట్టుచప్పుడు కాకుండా పాడు పని.. ఈ 23 ఏళ్ల యువతికి కోట్లలో ఆస్తి ఎలా వచ్చిందా అని ఆరా తీస్తే..!

rajastan-crime-news.jpg

ఓ రోజు ఇదే విషయమై చివరిసారిగా కూతురిని హెచ్చరించింది. ఆమె వినకపోవడంతో పక్కనే ఉన్న గొడల్లితో కూతురును (Mother assaults daughter) హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని కొడుకు హనీఫ్ సాయంతో సమీపంలోని బావిలో పడేసింది. తన కూతురు కనిపించలేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. చివరకు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు.. మొదట అత్యాచారానికి గురైందేమో అనుకున్నారు. అయితే అందుకు తగ్గ ఆధారాలు లేకపోవడంతో చివరకు తల్లిని అదుపులోకి తీసుకుని గట్టిగా విచారించారు. నేరం అంగీకరించడంతో తల్లీ, కొడుకుపై కేసులు నమోదు చేశారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

20 ఏళ్ల తర్వాత అందిన సంతానం.. ఆ భార్యాభర్తలిద్దరి సంతోషం మూడు నెలల్లోనే ఆవిరి.. ఒకే ఒక్క ఘటనతో..

Updated Date - 2023-05-04T19:27:37+05:30 IST