Crime: ఈ కుర్రాడు ఇంత ఘోరం చేశాడంటే అస్సలు నమ్మలేరు.. ఏడాది వయసున్న కొడుకు ఆమెకు ఉన్నాడని తెలిసి కూడా..!

ABN , First Publish Date - 2023-10-05T17:37:28+05:30 IST

కొందరు పైకి మాత్రం ఎంతో అమాయకంగా కనిపిస్తుంటారు. తీరా వారి అసలు స్వరూపం బయటపడగానే.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఇన్ని నేరాలు చేసింది వీరేనా... అని అనిపిస్తుంటుంది. ఇలాంటి నేరస్థులకు సంబంధించిన వార్తలు తరచూ వింటూనే ఉంటాం. తాజాగా..

Crime: ఈ కుర్రాడు ఇంత ఘోరం చేశాడంటే అస్సలు నమ్మలేరు.. ఏడాది వయసున్న కొడుకు ఆమెకు ఉన్నాడని తెలిసి కూడా..!

కొందరు పైకి మాత్రం ఎంతో అమాయకంగా కనిపిస్తుంటారు. తీరా వారి అసలు స్వరూపం బయటపడగానే.. అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తుంటారు. ఇన్ని నేరాలు చేసింది వీరేనా... అని అనిపిస్తుంటుంది. ఇలాంటి నేరస్థులకు సంబంధించిన వార్తలు తరచూ వింటూనే ఉంటాం. తాజాగా, హర్యానాలో ఇలాంటి కేసు ఒకటి వెలుగులోకి వచ్చింది. ఓ యువకుడిని చూసి అంతా ముందు అమాయకుడు అనుకున్నారు. చివరకు ఏడాది వయసున్నకొడుకు కలిగిన మహిళ పట్ల అతడి చేసిన దారుణం తెలుసుకుని అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

హర్యానా (Haryana) నుమ్ జిల్లాలోని బిచౌర్ పరిధి బిస్రూ గ్రామ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక హతిన్‌లోని హుచాపురి కలాన్ పోలీస్ స్టేషన్‌ పరిధికి చెందిన అయాజ్‌ అనే యువకుడికి, కోటల్క ప్రాంతానికి చెందిన న్యాయవాది శకునత్ భార్యకు కొన్ని నెలల క్రితం పరిచయం ఏర్పడింది. ఇది కాస్త కొన్నాళ్లకు వివాహేతర సంబంధానికి దారి తీసింది. సదరు మహిళ తన కుటుంబ సభ్యులకు తెలీకుండా అయాజ్‌ను కలుస్తూ ఉండేది. ఈ క్రమంలో చివరకు అతన్నే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఇదే విషయాన్ని ఓ రోజు అయాజ్‌కు చెప్పింది. అయితే ఆమెను వివాహం చేసుకోవడం అయాజ్‌కు ఇష్టం లేదు. దీంతో ఈ ప్రస్తావన వచ్చినప్పుడల్లా ఏదోటి చెప్పి వాయిదా వేస్తూ వచ్చాడు.

Viral Video: బాబోయ్.. ఇదెక్కడి వింత..? తలపై ఫ్రిడ్జ్‌ను పెట్టుకుని మోయడమే గొప్ప అనుకుంటే.. ఈ కుర్రాడు ఏం చేస్తున్నాడో చూస్తే..!

ఇటీవల ఆమె అతడిపై మరింత ఒత్తిడి చేసింది. దీంతో ఆమెపై అయాజ్ పగ పెంచుకున్నాడు. చివరకు ఆమెను అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. తనకు తెలిసిన వారికి ఈ విషయాన్ని చెప్పి సుఫారీ ఇచ్చి హత్య చేసేలా మాట్లాడుకున్నాడు. పథకం ప్రకారం సెప్టెంబర్ 27న రాత్రి ఆమెను బిస్రూ గ్రామ సమీపంలోని నిర్మానుష్య ప్రదేశంలోకి తీసుకెళ్లాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న వారితో కలిసి ఆమెను అతి కిరాతకంగా గొంతు కోసి హత్య చేశాడు. ఆ సమయంలో మహిళ ఏడాది కొడుకు కూడా ఆమెతో పాటూ ఉన్నాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణను వేగంవంతం చేశారు. ఎట్టకేలకు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. అతడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Viral News: మా నాన్నను అమ్మేస్తున్నా.. ఎవరైనా కొంటారా..? అంటూ ఇంటి గేటుకు బోర్డు పెట్టిన పిల్లాడు.. నెట్టింట పేలుతున్న సెటైర్లు..!

Updated Date - 2023-10-05T17:37:28+05:30 IST