Anju Love Story: భారత్‌కు రావాలని ఉందంటూ తండ్రికి వాయిస్ మెసేజ్.. పాక్‌లో పెళ్లయ్యాక అంజు నుంచి మరో ట్విస్ట్..!

ABN , First Publish Date - 2023-07-29T18:49:53+05:30 IST

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజూ ప్రేమ కథలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌ నుంచి పాకిస్థాన్ వెళ్లిన అంజు.. అక్కడి యువకుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే...

Anju Love Story: భారత్‌కు రావాలని ఉందంటూ తండ్రికి వాయిస్ మెసేజ్.. పాక్‌లో పెళ్లయ్యాక అంజు నుంచి మరో ట్విస్ట్..!

ఫేస్‌బుక్‌లో పరిచయమైన యువకుడిని కలుసుకునేందుకు పాకిస్థాన్ వెళ్లిన అంజూ ప్రేమ కథలో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. రాజస్థాన్‌ నుంచి పాకిస్థాన్ వెళ్లిన అంజు.. అక్కడి యువకుడిని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే, పాక్‌లో పెళ్లయ్యాక అంజు తాజాగా మరో ట్విస్ట్ ఇచ్చింది. భారత్ రావాలని ఉందంటూ తండ్రికి వాయిస్ మెసేజ్ పెట్టిన యువతి.. చివరగా చెప్పింది విని అంతా అవాక్కవుతున్నారు.

రాజస్థాన్‌కు (Rajasthan) చెందిన అంజు అనే యువతి ప్రేమ కథకు సంబంధించిన ఓ తాజా వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని (Uttar Pradesh) కైలోర్ గ్రామంలో జన్మించి రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో నివసించే 34 ఏళ్ల అంజుకు, పాకిస్థాన్‌లోని (Pakistan) పాకిస్తాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు చెందిన 29 ఏళ్ల నస్రుల్లాతో 2019లో ఫేస్‌బుక్‌లో (Facebook) పరిచయం ఏర్పడింది. అనంతరం కొద్ది రోజులకే వారి మధ్య ప్రేమ (love) మొదలైంది. ఈ క్రమంలో ప్రియుడిని కలిసేందకు జూన్‌లో వీసా తీసుకుని పాకిస్థాన్ వెళ్లింది. తాజాగా మంగళవారం ఆమెకు నస్రుల్లాతో వివాహం (marriage) జరిగినట్లు సాక్షాత్తూ డీఐజీ స్థాయి అధికారే వెళ్లడించిన విషయం తెలిసిందే. వివాహానంతరం అంజు, నస్రుల్లా ఇద్దరూ కలిసి అక్కడి పార్కుల్లో కలిసి తిరిగిన వీడియోలు, ఫోటోలు (Viral photos and videos) కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.

Viral Video: అప్పటిదాకా కేవలం కుక్కలే కదా అనుకున్నాడు.. ఒకే ఒక్క ఘటనతో వాటి ఉపయోగం తెలిసొచ్చింది.. నిమిషం ఆలస్యం అయ్యున్నా..

anju-love-story.jpg

భర్త, ఇద్దరు పిల్లలకు అన్యాయం చేసి, ప్రియుడి కోసం పాకిస్థాన్ వెళ్లడంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కూతురు చనిపోందని అందరికీ చెప్పుకొన్నారు. ఇదిలావుండగా, తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లోని గ్రామంలో నివసిస్తున్న తన తండ్రికి వాయిస్ మెసేజ్ పంపించింది. తాను పాకిస్థాన్ చూసేందుకు మాత్రమే వెళ్లానని, తనకు ఎవరితో పెళ్లి కాలేదని చెప్పింది. అవన్నీ ఒట్టి పుకార్లేనంటూ కొట్టి పారేసింది. తనకు భారత్ రావాలని ఉందంటూ ఏడుస్తూ చెప్పింది. అలాగే బాధతో కూడిన ఎమోజీని, అలాగే చేతులు జోడించి క్షమాపణలు చెప్పే ఎమోజీని కూడా పంపించింది. తాజా సమాచారం ప్రకారం.. ఆమెకు భారత్ రావాలని ఉందని, అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత భర్త తనను స్వాగతిస్తాడా, లేదా అనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆమె వీసా గడుపు ఆగస్టు 20 వరకు మాత్రమే ఉండడంతో.. ఈమె ప్రేమ కథలో ఇంకెన్ని ట్విస్టులు చోటు చేసుకుంటాయోనని అంతా ఆసక్తిగా గమనిస్తున్నారు.

Viral Video: కొన్ని నెలలుగా మంచంపై పడుకోవడానికే భయపడుతున్న ఆర్మీ అధికారి.. చివరకు కేర్ టేకర్ వెళ్లి పరుపు కింద పరిశీలించగా..

Updated Date - 2023-07-29T18:49:53+05:30 IST