Shocking: బస్సు కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు.. సడన్‌గా పక్కనే వచ్చి ఆగిందో కారు.. తెలిసిన వ్యక్తే కదా అని ఎక్కితే..!

ABN , First Publish Date - 2023-08-23T16:08:07+05:30 IST

ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలీని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా మంచిగా ఉన్న వారు కాస్తా.. ఒక్కసారిగా మానవ మృగాళ్లలా మారిపోతుంటారు. నగలు, నగదు కోసం కొందరు, తమ కామవాంఛను తీర్చుకోవడానికి మరికొందరు.. దారుణాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా...

Shocking: బస్సు కోసం ఎదురు చూస్తున్న భార్యాభర్తలు.. సడన్‌గా పక్కనే వచ్చి ఆగిందో కారు.. తెలిసిన వ్యక్తే కదా అని ఎక్కితే..!
ప్రతీకాత్మక చిత్రం

ప్రస్తుత సమాజంలో ఎవరిని నమ్మాలో.. ఎవరిని నమ్మకూడదో తెలీని పరిస్థితి నెలకొంది. అప్పటిదాకా మంచిగా ఉన్న వారు కాస్తా.. ఒక్కసారిగా మానవ మృగాళ్లలా మారిపోతుంటారు. నగలు, నగదు కోసం కొందరు, తమ కామవాంఛను తీర్చుకోవడానికి మరికొందరు.. దారుణాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. తాజాగా, మధ్యప్రదేశ్‌లో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. దంపతులు బస్సు కోసం ఎదురు చూస్తుండగా.. సడన్‌గా వారి వద్దకు ఓ కారు వచ్చి ఆగింది. తెలిసిన వారే కదా అని కారు ఎక్కడంతో చివరకు ఏం జరిగిందంటే..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) భోపాల్‌లోని రతీబాద్ పరిధి ప్రాంతానికి చెందిన 30 ఏళ్ల మహిళ, ఆమె భర్త.. స్థానికంగా ఉన్న కూలి పని చేస్తుంటారు. వీరికి ఇదే ప్రాంతానికి చెందిన సంతోష్ అనే వ్యక్తితో పరిచయం ఉంది. దీంతో అతను ఈ దంపతులను (couple) తెలిసిన కాంట్రాక్టర్ వద్ద పనికి కుదిర్చాడు. ప్రస్తుతం సదరు దంపతులు అక్కడే పని చేస్తున్నారు. ఇదిలావుండగా, ఆదివారం సాయంత్రం దంపతులు తమ బంధువుల ఇంటికి వెళ్లేందుకు బస్సు కోసం వేచి చూస్తూ ఉన్నారు. ఇంతలో సంతోష్ కారులో అటుగా వచ్చాడు.

Viral Video: బాబోయ్.. ఒక్క ఆటోలో 21 మంది ప్రయాణీకులా..? అలా ఎలా ఎక్కించాడా..? అని డౌటా..? ఈ వీడియోను చూస్తే..!

కారులో అప్పటికే కాంట్రాక్టర్ వద్ద అకౌంటెంట్‌గా పని చేసే మున్షీ అనే వ్యక్తి కూడా ఉన్నాడు. లిఫ్ట్ ఇస్తామంటూ దంపతులను కారులో ఎక్కించుకున్న వారు.. కొద్ది దూరం వెళ్లగానే భర్తకు మద్యం తాగించారు. తెలిసిన వారే కావడంతో అతను కూడా కాదనలేక తాగాడు. అయితే అందులో మత్తు మందు కలపడంతో కాసేపటికి భర్త అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తర్వాత నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్లి.. మహిళపై నిందితులు (Indecent behavior) అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం వారిని స్థానికంగా ఉన్న ఓ ఆలయం వద్ద వదిలేసి పారిపోయారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాశంగా మారింది.

Mother: రాత్రి 10 గంటల సమయం.. తల్లి చేతిలో మొబైల్‌ను చూసిన 17 ఏళ్ల కుర్రాడు.. తెల్లారేసరికి షాకింగ్ సీన్..!

Updated Date - 2023-08-23T16:08:07+05:30 IST