Nara Lokesh: జగన్‌పై నారా లోకేష్ సెటైర్.. మాములుగా లేదుగా..!!

ABN , First Publish Date - 2023-07-22T12:52:56+05:30 IST

తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో ‘ఎందరో మహానుభావులు.. ఒక్కరే ‘చీప్’ మినిస్టర్ అంటూ లోకేష్ ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో ఏపీకి సేవలు అందించిన మాజీ సీఎంలందరూ ఒకవైపు ఉండగా.. సందర్భం ఏదైనా వెకిలి నవ్వులు చిందించే జగన్ మరోవైపు ఉన్నారు. ఈ సందర్భంగా చీఫ్ మినిస్టర్స్ వర్సెస్ చీప్ మినిస్టర్ అంటూ లోకేష్ సదరు ఫోటోకు క్యాప్షన్ పెట్టారు.

Nara Lokesh: జగన్‌పై నారా లోకేష్ సెటైర్.. మాములుగా లేదుగా..!!

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం పాదయాత్ర (Yuvagalam PadaYatra) ప్రస్తుతం ప్రకాశం జిల్లా(Prakasam District)లో కొనసాగుతోంది. ఈ సందర్భంగా అన్ని వర్గాల ప్రజలతో మాట్లాడుతూ లోకేష్ తన ప్రయాణం సాగిస్తున్నారు. ఆయన పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. లోకేష్ ఎక్కడ సభలు ఏర్పాటు చేసినా జనం భారీగా హాజరవుతున్నారు. యువనేతకు వస్తున్న ప్రజా స్పందన చూసి అధికార పార్టీ వైసీపీ నేతలు ఓర్వలేక విమర్శలు చేస్తున్నారు. తాజాగా శుక్రవారం నాడు వెంకటగిరి బహిరంగ సభలో సీఎం జగన్ (Jagan Mohan Reddy) మరోసారి లోకేష్‌ను ఉద్దేశిస్తూ పరోక్షంగా ఆరోపణలు చేశారు. దీంతో జగన్‌పై నారా లోకేష్ సెటైర్ వేస్తూ సోషల్ మీడియా(Social Media)లో చేసిన పోస్ట్‌ ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది.


తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన జగన్‌ను ఉద్దేశిస్తూ టీడీపీ యువనేత నారా లోకేష్ ట్విట్టర్ వేదికగా ఓ పోస్ట్ చేశారు. అందులో ‘ఎందరో మహానుభావులు.. ఒక్కరే ‘చీప్’ మినిస్టర్ అంటూ లోకేష్ ఓ ఫోటోను షేర్ చేశారు. అందులో ఏపీకి సేవలు అందించిన మాజీ సీఎంలందరూ ఒకవైపు ఉండగా.. సందర్భం ఏదైనా వెకిలి నవ్వులు చిందించే జగన్ మరోవైపు ఉన్నారు. ఈ సందర్భంగా చీఫ్ మినిస్టర్స్ వర్సెస్ చీప్ మినిస్టర్ అంటూ లోకేష్ సదరు ఫోటోకు క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్ట్ అందరినీ ఆకట్టుకుంటుండగా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కొందరు టీడీపీ అభిమానులు అయితే జగన్‌ను బిత్తర కుమార్ అంటూ సంభోదిస్తున్నారు. రాష్ట్రంలోని ప్రజా సమస్యలను పట్టించుకోకుండా సీఎం జగన్ ప్రతిపక్ష నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ పరువు పోగొట్టుకుంటున్నారని కొందరు పోస్ట్ చేస్తున్నారు.


ముఖ్యమంత్రి అనే పదవికి ఒక వాల్యూ ఉంటుందని.. రాష్ట్రం గురించి మాట్లాడమంటే సీఎం పదవిలో ఉన్న వ్యక్తి పక్కనోళ్ల పెళ్లాల గురించి.. మందు గురించి మాట్లాడుతూ చవట సన్నాసిలా ప్రవర్తిస్తున్నారని సోషల్ మీడియాలో కొందరు నెటిజన్‌లు పోస్టులు పెడుతున్నారు. అటు నారా లోకేష్ మాత్రం యువగళం పాదయాత్రలో ప్రజాసమస్యలపై పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నారు. ప్రభుత్వంపై ఎవరు వ్యతిరేకంగా మాట్లాడినా అక్రమ కేసులు పెడుతూ జగన్ రెడ్డి భయపెడుతున్నారని.. ఒక దొంగ.. సమాజంలోని అందరినీ దొంగలుగా చిత్రీకరించాలని భావిస్తున్నారని నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి:

Jagan Mohan Reddy: అయ్యా జగన్.. సీఎం స్థాయిలో ఇలాగేనా మాట్లాడేది?

****************************************************************************************************

Pattiseema: జగన్ సర్కారు నోట.. చంద్రబాబు ప్రాజెక్టు మాట..!!

******************************************************************************************************

AP Politics: లోకేష్‌కు భయపడుతున్న వైసీపీ.. అందుకే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తోందా?

Updated Date - 2023-07-22T12:52:56+05:30 IST