Home » Jagan Mohan Reddy
మాజీ సీఎం జగన్ కు వ్యక్తిగత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న పిటిషన్పై సీబీఐ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. జగన్ అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దీంతో వ్యక్తి గత హాజరు మినహాయింపు ఇవ్వాలన్న మోమోను జగన్ తరఫు న్యాయవాది వెనిక్కి తీసుకున్నారు.
సోషల్ మీడియాలో టీడీపీ నేతలపై ముఖ్యంగా లోకేశ్, జనసేన అధినేత పవన్లపై వైసీపీ అనుకూల సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ.. విమర్శలు చేశారు. ప్రత్యర్థి పార్టీల నాయకులపై వ్యక్తిగత విమర్శలు సైతం చేశారు.
వెలిగొండ నిర్మాణం పూర్తి కాకుండానే గత ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ ప్రాజెక్టును ప్రారంభించారని మంత్రి రామానాయుడు తెలిపారు. తల్లిని, చెల్లిని మోసం చేసిన జగన్కు ప్రకాశం జిల్లా ప్రజల్ని మోసం చెయ్యడం లెక్కకాదని ఆరోపించారు.
ఏపీకి పట్టిన దరిద్రం జగన్ అని ఎమ్మెల్యే ఆదినారాయణ విమర్శించారు. రాష్ట్రం నుంచి జగన్ను పూర్తిగా తరిమికొట్టాలని పేర్కొన్నారు.
హైవేపై ఎటువంటి గుమిగూడటం గాని సమావేశాలు నిర్వహించడానికి గాని అనుమతి లేదని డీఎస్పీ సీహెచ్.రాజా తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లో హైవేపై వాహన రాకపోకలు, ప్రజా జీవనానికి ఎటువంటి అంతరాయం కలిగించరాదని పేర్కొన్నారు.
తుఫాన్ సమయంలో ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం పనిచేసిందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ స్పష్టం చేశారు. దాదాపు 1500 మంది విద్యుత్ శాఖ సిబ్బందిని ముందస్తు చర్యల్లో భాగంగా ప్రభావిత ప్రాంతాలకు పంపించినట్లు పేర్కొన్నారు.
గత ప్రభుత్వ హయాంలో మాజీ సీఎం జగన్ను నమ్మి అనేకమంది ఇప్పుడు అధికారులు జైళ్లకు వెళ్లారని కొనకళ్ళ నారాయణ గుర్తు చేశారు. గత ఐదేళ్లల్లో మీ ధన దాహం కారణంగా ఇప్పుడూ అధికారులు, నాయకులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు.
మాజీ సీఎం జగన్ విశాఖ నుంచి మాకవరపాలెం వరకు 63 కిలో మీటర్ల జాతీయ రహదారిపై కాన్వాయ్తో రావడానికి వైసీపీ శ్రేణులు అనుమతులు కోరినట్లు తెలిపారు. విశాఖ నుంచి మాకవరపాలెం వరకు హెలికాప్టర్పై మాజీ సీఎం జగన్ వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలని సూచించినట్లు చెప్పారు.
జగన్పై ఉన్న అవినీతి కేసులు, ఈడీ కేసులు తుది దశకు చేరుకున్నాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుల్లో ఇంకెన్నేళ్లు జైల్లో మగ్గాల్సి ఉంటుందో..? అని అనుమానం వ్యక్తం చేశారు.
గతంలో జగన్ రాసిన లేఖపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు రూలింగ్ ఇచ్చారు. ప్రజలు ఇవ్వని ప్రతిపక్ష హోదాను తామెలా ఇస్తానని ప్రశ్నించారు.