Home » Jagan Mohan Reddy
‘ఐదేళ్ల పాలనలో జగన్మోహన్రెడ్డి రాష్ట్రాన్ని డ్రగ్స్, గంజాయి మయం చేశాడు.
ఏపీలో ఎన్నికల వాతావరణం రోజురోజుకు వేడెక్కుతోంది. సమయం దగ్గరపడుతున్న కొద్దీ వైసీపీలో ఓటమి భయం పెరుగుతోంది. ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా పోటీచేస్తుండటంతో వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారట. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సైతం వైసీపీని వణికిస్తోందనే చర్చ జరుగుతోంది.
ఏపీలో (Andhra Pradesh) మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గానికి ప్రత్యేక ఉంది. మచిలీపట్నం కేంద్రంగా నాయకులు స్వాతంత్య్ర ఉద్యమాన్ని నడిపారు. డాక్టర్ భోగరాజు పట్టాభి సీతారామయ్య, ముట్నూరి కృష్ణారావు, కోపల్లె హనుమంతరావు ఆంధ్రపత్రికను స్థాపించి అప్పట్లో ప్రజలను స్వాతంత్య్ర ఉద్యమంవైపు మళ్లేలా చేశారు...
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల బిజీగా ఉన్నారు. ప్రతి నియోజకవర్గంలో ఉన్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. కర్నూలు జిల్లా కోడుమూరులో జరిగిన బహిరంగ సభలో షర్మిల ప్రసంగించారు. కోడుమూరు ఎమ్మెల్యే, సీఎం జగన్పై విమర్శలు గుప్పించారు. గుండ్రెవుల ప్రాజెక్ట్ వైఎస్ఆర్ కల అని, ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని అనుకున్నారని వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల వేళ (AP Elections) ఎన్నో రహస్యాలు బయటపడుతున్నాయి. నామినేషన్ల ప్రక్రియ మొదలవ్వడంతో పోటీలో ఉన్న అభ్యర్థులు ఎన్నికల సంఘానికి తమ అఫిడవిట్లు సమర్పిస్తున్నారు. ఈ అఫిడవిట్లలో అభ్యర్థులు ఆస్తులతో పాటు అప్పుల వివరాలు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి (CM YS Jagan Mohan Reddy) సొంత సోదరి వైఎస్ షర్మిళా రెడ్డి (YS Sharmila Reddy) అఫిడవిట్లో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. లక్షల కోట్ల అప్పులతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిన జగన్ ప్రభుత్వం.. సొంత కుటుంబాన్ని వదలలేదు.
రాష్ట్రవ్యాప్తంగా వాలంటీర్ల రాజీనామా అంటూ గత కొద్దిరోజులుగా ప్రతిరోజు వార్తలు వస్తున్నాయి. జగన్పై అభిమానంతో వైసీపీకి మద్దతుగా వాలంటీర్లు రాజీనామా చేస్తున్నారంటూ వైసీపీ నాయకులు చెబుతున్నారు. మరోవైపు విపక్షాల కారణంగా తమ వాలంటీర్ పోస్టు పోయిందని, ఈ ఎన్నికల్లో వైసీపీని గెలిపిస్తే మళ్లీ తమ ఉద్యోగం వస్తుందంటూ ఇంటింటికి వెళ్లి వైసీపీ తరపున వాలంటీర్లు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తద్వారా సానుభూతితో ఓట్లు వేయించుకునేందుకు వాలంటీర్లకు తెలియకుండానే వైసీపీ ఓ పెద్ద ప్లాన్కు తెరలేపింది.
ఏపీ సీఎం వైఎస్ జగన్ పై ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. బీజేపీ మెడలు వంచి హోదా తెస్తాం అని చెప్పాడని గుర్తుచేశారు. తర్వాత కేసుల భయంతో బీజేపీకి భయపడి ఒక్కసారి కూడా హోదా గురించి మాట్లాడలేదని మండిపడ్డారు. ఒకవేళ రాష్ట్రానికి హోదా వచ్చి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని స్పష్టం చేశారు.
రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను కలిసిన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలను ఆయన కలిశారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ.. బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారన్నారు. ప్రజల ఆశీర్వాదంతో ప్రాణాపాయం తప్పిందని, మరోసారి అధికారంలోకి వస్తున్నామని విశ్వాసం వ్యక్తం చేశారు.
వైఎస్సార్ కుమారుడు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి బానిస అని ఏపీసీసీ చీఫ్, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ షర్మిల ఫైర్ అయ్యారు. గోద్రాలో దాడులు జరిగితే జగన్ నోరు విప్పలేదని మండిపడ్డారు. బీజేపీ అంటేనే గిట్టని వైఎస్సార్ కు బీజేపీకి బానిస అయిన జగన్ వారసుడు ఎలా అవుతారని ప్రశ్నించారు.
ఇదో.. బొమ్మల కథ! సీఎం జగన్ ఫొటోలతో ఏర్చికూర్చిన అందమైన చిత్రాల కథ!! దీనికి స్ర్కీన్ప్లే, డైరెక్షన్..