AP Politics: లోకేష్‌కు భయపడుతున్న వైసీపీ.. అందుకే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తోందా?

ABN , First Publish Date - 2023-07-19T15:30:21+05:30 IST

నారా లోకేష్‌కు టీడీపీ అభిమానుల అండదండలు దక్కకుండా చేసేందుకు సీఎం జగన్ తన పార్టీ నేతలతో కుయుక్తులు పన్నుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్‌రెడ్డి తన అనుచరులతో టీడీపీ సభల్లో ఎన్టీఆర్ నినాదాలు చేయించడం, ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టించడం వంటి పనులు చేస్తున్నారని తేలిపోయింది. జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ భవిష్యత్‌పై స్వయంగా స్పష్టం చేసినా వైసీపీ మాత్రం తన కుతంత్రాలు చేస్తూనే పోతోంది.

AP Politics: లోకేష్‌కు భయపడుతున్న వైసీపీ.. అందుకే ఎన్టీఆర్ ప్రస్తావన తెస్తోందా?

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) చేపట్టిన యువగళం (Yuvagalam) పాదయాత్రకు అద్భుత రీతిలో స్పందన వస్తోంది. ప్రస్తుతం ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న లోకేష్ పాదయాత్రకు ప్రజలు నీరాజనం పడుతున్నారు. టీడీపీ (TDP) ఎక్కడ సభ పెట్టినా బారులు తీరుతున్నారు. దీంతో వైసీపీ(YCP)లో భయం మొదలైంది. లోకేష్ పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి వైసీపీ నేతలకు కంటి మీద కునుకు ఉండటం లేదు. ముఖ్యంగా వచ్చే ఎన్నికల్లో టీడీపీ ప్రభంజనం సృష్టించబోతోందని ముందుగానే ఊహించి ఆ పార్టీ నేతలు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. టీడీపీ సభ ఎక్కడ జరిగినా జూనియర్ ఎన్టీఆర్ (Junior NTR) ప్రస్తావన తెస్తూ అభిమానులను రెండుగా చీలగొట్టేందుకు కుతంత్రాలు పన్నుతున్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టించి వివాదం రేపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాలోనూ జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టించి టీడీపీలో అలజడి సృష్టించేందుకు పన్నాగం పన్నారు.

ముఖ్యంగా నారా లోకేష్‌కు టీడీపీ అభిమానుల అండదండలు దక్కకుండా చేసేందుకు సీఎం జగన్ తన పార్టీ నేతలతో కుయుక్తులు పన్నుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్‌రెడ్డి తన అనుచరులతో టీడీపీ సభల్లో ఎన్టీఆర్ నినాదాలు చేయించడం, ఎన్టీఆర్ ఫ్లెక్సీలు కట్టించడం వంటి పనులు చేస్తున్నారని తేలిపోయింది. గతంలో అయితే నిజంగా ఎన్టీఆర్ అభిమానులే ఇలా చేస్తున్నారని టీడీపీ నేతలు భావించేవాళ్లు. ఎందుకంటే ఫ్లెక్సీల్లో సీనియర్ ఎన్టీఆర్, చంద్రబాబు ఫోటోలు కూడా ఉండేవి. అయితే టీడీపీ నేతల సభల్లో తరచూ ఇదే రిపీట్ అవుతుండటంతో ఆ పార్టీ నేతలు ఆరా తీయగా అసలు విషయం బయటకు వచ్చింది. ఇదంతా వైసీపీ నేతలు చేస్తున్న చీప్ పాలిటిక్స్ అని స్పష్టం కావడంతో టీడీపీ నేతలు మండిపడుతున్నారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మరోసారి సీఎం కారని తేలిపోవడంతోనే వైసీపీ ఇలా కుతంత్రాలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Yuvagalam Padayatra : ఐ ప్యాక్ సభ్యుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు

కాగా జూనియర్ ఎన్టీఆర్ తన రాజకీయ భవిష్యత్‌పై స్వయంగా స్పష్టం చేసినా వైసీపీ మాత్రం తన కుతంత్రాలు చేస్తూనే పోతోంది. రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్‌కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల సంఖ్య భారీగా పెరిగింది. దీనిని అదునుగా చేసుకుని వైసీపీ నేతలు రెచ్చిపోతున్నారు. సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్‌కు రాజకీయాలు అంటగట్టి టీడీపీ వర్గాల్లో చీలిక తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. తనకు ఇప్పట్లో రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని ఎన్టీఆర్ చెప్పినా పరిగణనలోకి తీసుకోకుండా నిత్యం అతడి ఫ్లెక్సీలతో గందరగోళం సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. దీంతో లోకేష్‌ను ఎదుర్కోవడం జగన్ వల్ల కావడం లేదని.. ఎన్టీఆర్ రావాల్సిందే అన్నట్లు వైసీపీ నేతల తీరు ఉందని సోషల్ మీడియాలో సెటైర్లు పడుతున్నాయి. అసలు వాడు వచ్చేవరకు కొసరు వాడికి పండగేనని ఎన్టీఆర్ అభిమానులు రాయించినట్లు ఫ్లెక్సీల్లో ఉండటంతో వైసీపీ నేతలు ఇలాంటి రాజకీయాలు చేయడం సిగ్గుచేటు అని నెటిజన్‌లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2023-07-19T15:30:21+05:30 IST