Yuvagalam Padayatra : ఐ ప్యాక్ సభ్యుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు

ABN , First Publish Date - 2023-07-19T13:14:45+05:30 IST

యువగళం పాదయాత్రపై ఐ ప్యాక్ సభ్యులు నిఘా పెట్టారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రలోకి ఐ ప్యాక్ సభ్యుడు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐ ప్యాక్ సభ్యుడిని టీడీపీ క్యాడర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. యువగళం పాదయాత్రలో జరుగుతున్న లైవ్ అప్డేట్స్‌ను, ఎప్పటికప్పుడు ఐ ప్యాక్ సభ్యులు బయటికి చేరవేస్తున్నారు.

Yuvagalam Padayatra : ఐ ప్యాక్ సభ్యుడిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న టీడీపీ కార్యకర్తలు

కనిగిరి : యువగళం పాదయాత్రపై ఐ ప్యాక్ సభ్యులు నిఘా పెట్టారు. కనిగిరి నియోజకవర్గంలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న పాదయాత్రలోకి ఐ ప్యాక్ సభ్యుడు రావడం తీవ్ర కలకలం రేపుతోంది. ఐ ప్యాక్ సభ్యుడిని టీడీపీ క్యాడర్ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుంది. యువగళం పాదయాత్రలో జరుగుతున్న లైవ్ అప్డేట్స్‌ను, ఎప్పటికప్పుడు ఐ ప్యాక్ సభ్యులు బయటికి చేరవేస్తున్నారు. టీడీపీ నారా లోకేష్ ను రాజకీయంగా ఎదుర్కోలేక, వైసీపీ దిగజారుడు పనులు చేసిందని టీడీపీ నేతలు అంటున్నారు. వైసీపీ నేతల కుట్రలను టీడీపీ క్యాడర్ సమర్ధవంతంగా తిప్పికొడుతోంది. కాగా.. నారా లోకేష్ ఇప్పటి వరకూ 2092.9 కి.మీ. పాదయాత్ర నిర్వహించారు.

నేడు నారా లోకేష్ పాదయాత్ర వివరాలు..

12.00 – పెద్దలవలపాడు శివారు క్యాంప్ సైట్ లో కనిగిరి అసెంబ్లీ నియోజకవర్గ వలస కార్మికులతో రచ్చబండ కార్యక్రమం.

సాయంత్రం

3.00 – పెద్దలవలపాడు శివార్ల నుండి పాదయాత్ర ప్రారంభం.

3.05 – పెద్దలవలపాడు బ్రిడ్జి వద్ద స్థానికులతో మాటామంతీ.

4.35 – రామాపురం – గుడారివారిపాలెం గ్రామస్తులతో సమావేశం.

6.05 – అజీజ్ పురంలో స్థానికులతో సమావేశం.

6.20 – అజీజ్ పురంలో పాదయాత్ర 2100 కి.మీ. చేరిక, శిలాఫలకం ఆవిష్కరణ.

8.20 – కనిగిరి శివారు శంఖవరం విడిది కేంద్రంలో బస.

Updated Date - 2023-07-19T13:14:45+05:30 IST