Share News

Minister Nagarjuna: జగనన్న ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతాం

ABN , Publish Date - Dec 24 , 2023 | 05:31 PM

జగనన్న మాటే మాది...ఆయన ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతామని మంత్రి మేరుగ నాగార్జున ( Minister Meruga Nagarjuna ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు మంత్రి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊరికే వచ్చాడా.. వైసీపీకి పని చేసి డబ్బులు తీసుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ కన్నా ఆరుగురు ప్రశాంత్ కిషోర్లు జగన్ గుండెల్లో ఉన్నారు’’ అని మంత్రి మేరుగ నాగార్జున పేర్కొన్నారు.

Minister Nagarjuna: జగనన్న ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతాం

ప్రకాశం : జగనన్న మాటే మాది...ఆయన ఎక్కడ దూకమంటే అక్కడ దూకుతామని మంత్రి మేరుగ నాగార్జున ( Minister Meruga Nagarjuna ) వ్యాఖ్యానించారు. ఆదివారం నాడు మంత్రి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ...‘‘ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఊరికే వచ్చాడా.. వైసీపీకి పని చేసి డబ్బులు తీసుకున్నాడు. ప్రశాంత్ కిషోర్ కన్నా ఆరుగురు ప్రశాంత్ కిషోర్లు జగన్ గుండెల్లో ఉన్నారు. రాజకీయం ఎలా చేయాలో మా నాయకుడికి తెలుసు. ఎంత మంది ప్రశాంత్ కిషోర్లు అమ్ముడుపోయినా వైసీపీకి ఏమీకాదు. నియోజక వర్గాల్లో అభ్యర్థుల మార్పు ప్రతి పార్టీలో జరుగుతుంది. టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ బీసీలు బలంగా ఉన్న నియోజక వర్గాల్లో పోటీ చేస్తున్నారు. రాజశేఖరరెడ్డి కుటుంబాన్ని చూసి పాదయాత్ర ఎలా చేయాలో నేర్చుకోవాలి. పాదయాత్రలో లోకేష్ రాసిన ఎర్రపుస్తకాన్ని ఏం చేస్తాడు’’ అని మంత్రి మేరుగ నాగార్జున ఎద్దేవ చేశారు.

Updated Date - Dec 24 , 2023 | 05:31 PM