Kondru Murali Mohan: తమ్మినేని స్పీకర్ స్థానాన్ని అగౌరవపర్చారు

ABN , First Publish Date - 2023-09-21T20:26:13+05:30 IST

ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్‌(Assembly Sessions)లో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తన స్థానాన్ని అగౌరవపరిచారని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్(Kondru Murali Mohan) వ్యాఖ్యానించారు.

Kondru Murali Mohan: తమ్మినేని స్పీకర్ స్థానాన్ని అగౌరవపర్చారు

అమరావతి: ఈ రోజు జరిగిన అసెంబ్లీ సెషన్స్‌(Assembly Sessions)లో స్పీకర్ తమ్మినేని సీతారాం(Speaker Tammineni Sitaram) తన స్థానాన్ని అగౌరవపరిచారని మాజీమంత్రి కొండ్రు మురళీమోహన్(Kondru Murali Mohan) వ్యాఖ్యానించారు. గురువారం నాడు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అసెంబ్లీలో సభా స్థానంలో ఉన్న తమ్మినేని వ్యవహార శైలి ఆక్షేపనీయం. నేను మొదట వైసీపీ కార్యకర్తని తర్వాతే అసెంబ్లీ స్పీకర్‌నని తమ్మినేని స్వయంగా చెప్పారు. స్పీకర్ స్థానానికి మచ్చ తెచ్చారు. రాజమండ్రి జైల్లో టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu)కు ప్రాణహాని ఉంది. జైల్లో చంద్రబాబును మర్డర్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రజల్లో చర్చ జరుగుతోంది. 14 ఏళ్లు సీఎంగా పని చేసిన ముఖ్యమంత్రికి కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం అయ్యారు. చంద్రబాబుకు ఏమైనా జరిగితే పరిస్థితి చేజారిపోతుంది. బాబుకు జరగకూడనిది జరిగితే దానికి బాధ్యత జగన్‌దేనని కొండ్రు మురళీమోహన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2023-09-21T20:26:13+05:30 IST