NCBN: రేపు చంద్రబాబుని కలవనున్న పవన్, బాలకృష్ణ, లోకేష్

ABN , First Publish Date - 2023-09-13T21:09:23+05:30 IST

రేపు తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు(Nara Chandrababu Naidu)ను జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, హిందూపుర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, నారాలోకేష్ కలవనున్నారు.

NCBN: రేపు చంద్రబాబుని కలవనున్న పవన్, బాలకృష్ణ, లోకేష్

రాజమహేంద్రవరం: స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్‌ పేరిట అక్రమ కేసులో ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడితో (Nara Chandrababu Naidu) జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ రేపు (గురువారం) ములాఖత్ కాబోతున్నారు. ఆయన వెంట టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కూడా ఉంటారు. ఈ మేరకు రాజమండ్రి జైలు అధికారుల నుంచి ములాఖత్ కోసం పర్మిషన్ తీసుకున్నారు.

రేపు మధ్యాహ్నం 12 గంటలకు రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail) వద్దకు వెళ్లి చంద్రబాబు ఆరోగ్యం, భద్రత గురించి అడిగి తెలుసుకోనున్నారు. వీరి ములాఖత్ నేపథ్యంలో సెంట్రల్ జైలు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. రేపు ఉదయం 10 గంటలకు రాజమండ్రికి పవన్ కళ్యాణ్, బాలకృష్ణ రానున్నారు. ఈ మేరకు టీడీపీ నాయకులు ఏర్పాట్లు చేశారు.

Updated Date - 2023-09-14T11:06:48+05:30 IST