Chandrababu: హక్కులను వైసీపీ ప్రభుత్వం కాలరాస్తోంది
ABN , Publish Date - Dec 30 , 2023 | 05:34 PM
వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) హక్కులను కాలరాస్తోందని తెలుగుదేశం ( TDP ) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) పేర్కొన్నారు. శనివారం నాడు కుప్పం టౌన్లో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారలతో స్వాగతాలు పలికారు.
చిత్తూరు: వైసీపీ ప్రభుత్వం ( YCP GOVT ) హక్కులను కాలరాస్తోందని తెలుగుదేశం ( TDP ) పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ( Nara Chandrababu Naidu ) పేర్కొన్నారు. శనివారం నాడు కుప్పం టౌన్లో చంద్రబాబు నాయుడు రోడ్ షో నిర్వహించారు. రోడ్డు పొడవునా చంద్రబాబుకు పార్టీ శ్రేణులు ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మహిళలు మంగళహారలతో స్వాగతాలు పలికారు. రోడ్ షో అనంతరం ఎన్టీఆర్ సర్కిల్ వద్ద అన్న క్యాంటీన్కు చేరుకొని పేదలకు అన్నదాన కార్యక్రమం చంద్రబాబు చేశారు. అంగన్వాడీ శిబిరానికి వెళ్లి అంగన్వాడీల ఆందోళనకు చంద్రబాబు మద్దతు పలికారు. కుప్పంలో అంగన్వాడీల శిబిరానికి వెళ్లి చంద్రబాబు మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ... టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే సమస్యలు పరిష్కరిస్తానని అంగన్వాడీలకు హామీ ఇచ్చారు. ప్రజాస్వామ్యంలో సమస్యలపై పోరాడే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుందని చంద్రబాబు పేర్కొన్నారు.