తమ ఊరి బాలికను మరో వ్యక్తి కలవడం నచ్చని యువకులు.. అర్ధరాత్రి ప్రేమికులు ఇంట్లో ఉండగా.. అక్కడికి వెళ్లి..

ABN , First Publish Date - 2022-12-29T21:18:55+05:30 IST

ప్రేమికులకు ఇరు వైపు తల్లిదండ్రులతో పాటూ కొన్నిసార్లు తోటి మిత్రుల నుంచి కూడా సమస్యలు ఎదురవుతుంటాయి. తమకు దక్కంది ఎవరికీ దక్కకూడదన్న ధోరణిలో కొందరు చివరకు..

తమ ఊరి బాలికను మరో వ్యక్తి కలవడం నచ్చని యువకులు.. అర్ధరాత్రి ప్రేమికులు ఇంట్లో ఉండగా.. అక్కడికి వెళ్లి..
ప్రతీకాత్మక చిత్రం

ప్రేమికులకు ఇరు వైపు తల్లిదండ్రులతో పాటూ కొన్నిసార్లు తోటి మిత్రుల నుంచి కూడా సమస్యలు ఎదురవుతుంటాయి. తమకు దక్కంది ఎవరికీ దక్కకూడదన్న ధోరణిలో కొందరు చివరకు దారుణాలకు పాల్పడుతుంటారు. మధ్యప్రదేశ్‌లో ప్రేమికుల విషయంలో విచిత్ర ఘటన చోటు చేసుకుంది. తమ ఊరి బాలికను మరో గ్రామానికి చెందిన వ్యక్తి ప్రేమించడం ఇద్దరు యువకులకు నచ్చలేదు. ఓ రోజు అర్ధరాత్రి ప్రేమికులు ఇంట్లో ఉండగా.. అక్కడికి వెళ్లిన యువకులు చేసిన పనికి అంతా షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..

ఫుల్‌గా తాగి ఇంటికొచ్చిన తండ్రి.. రాత్రి వేళ ఎవరూ ఊహించని విధంగా.. తల్లీకొడుకులు కలిసి..

మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ఖండ్వా సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక కుండ్లేశ్వర్ పరిధికి చెందిన ఇద్దరు బాలికలు కండ్లేశ్వర్‌లో ఓ అద్దె ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నారు. ఈ క్రమంలో సమీప గ్రామానికి చెందిన రామేశ్వర్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. వారిద్దరిలో ఓ బాలిక.. రామేశ్వర్‌కు బాగా దగ్గరైంది. అప్పటి నుంచి రోజూ సదరు యువకుడితో మాట్లాడుతూ ఉండేది. ఈ పరిచయం ప్రేమగా (love with girl) మారింది. తరచూ అతడు బాలికను కలుస్తూ ఉండేవాడు. అయితే కొన్నాళ్లకు ఈ విషయం.. బాలిక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు తెలిసింది. తమ ఊరి అమ్మాయిని వేరే గ్రామానికి చెందిన వ్యక్తి ప్రేమించడాన్ని వారు జీర్ణించుకోలేకపోయారు.

Viral Video: కోబ్రాపై తుపాకీతో కాల్పులు జరిపిన యువకులు.. పారిపోవాల్సిన పాము చివరికి ఏం చేసిందంటే..

fire.jpg

ఎలాగైనా అతడికి గుణపాఠం నేర్పాలని వేచి చూస్తూ ఉండేవారు. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజు రామేశ్వర్.. తన ప్రేయసిని కలిసేందుకు సోమవారం రాత్రి వేళ ఆమె గ్రామానికి వెళ్లాడు. ఈ విషయం బాలిక గ్రామానికి చెందిన యువకులకు తెలిసింది. అర్ధరాత్రి రామేశ్వర్ తన ప్రేయసితో కలిసి ఇంట్లో ఉండగా.. సదరు యువకులు అక్కడికి వెళ్లారు. అప్పటికే అతడి మీద కోపంతో ఉన్న వారు.. బయట ఉన్న రామేశ్వర్ బైకుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు.. అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేయించారు. కేసు నమోదు చేసుకుని, పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.

మూడో భర్త వీడియో కాల్ చేయగా.. రెండో భర్తతో కలిసి మాట్లాడిన మహిళ.. రాత్రి ఇద్దరూ మద్యం సేవించిన అనంతరం..

Updated Date - 2022-12-29T21:22:34+05:30 IST