Home » TOP NEWS
భాగ్యనగర(Hyderabad Rains) వాసులకు కాస్తంత ఉపశమనం ఇచ్చే చల్లటి కబురు చెప్పింది వాతావరణ శాఖ. ఇవాళ(ఏప్రిల్ 29) హైదరాబాద్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వెల్లడించింది.
ఎన్నికలకు పెద్దగా సమయం లేకపోవడంతో పార్టీలన్నీ బీభత్సమైన జోరును కనబరుస్తున్నాయి. పోటాపోటీగా జనాల్లోకి వివిధ కార్యక్రమాలతో వెళుతున్నాయి. పార్టీ అధినేతలు సైతం నిత్యం జనాల్లోనే ఉంటున్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల రాజకీయం హీటెక్కింది. మరి కాసేపట్లో జనసేన పవన్ కల్యాణ్ పిఠాపురం నియోజకవర్గంలో భారీ రోడ్ షో, ర్యాలీ నిర్వహించనున్నారు.
కొత్తగూడెంలో నేడు బీజేపీ ఎన్నికల ప్రచార బహిరంగ సభ జరగనుంది. ఈ సభకు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. విజయవాడ నుంచి జేపీ నడ్డా హెలికాఫ్టర్లో బయలుదేరి కొత్తగూడెంకు వెళతారు. కొత్తగూడెంలోని ప్రకాశం స్టేడియంలో జరగనున్న బహిరంగ సభలో పాల్గొంటారు.
కేంద్రంలో వచ్చేది హంగ్..! ఏ పార్టీకి మెజారిటీ వచ్చే అవకాశం లేదు..! హంగ్ వస్తే.. మనమే కింగ్ అవుతాం. నరేంద్ర మోదీకి 200 సీట్లకు మించి రావు.
గ్రేటన్ హైదరాబాద్లోని ఇన్నర్ రింగ్రోడ్లో.. ఎక్కడి నుంచైనా రూ.200లోపు ఖర్చుతో మెట్రోలో శంషాబాద్కు వెళ్లేలా హెచ్ఎంఆర్ఎల్ అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.
పోలీసులకు ఒక్క రోజైనా సెలవు లేకపోతే ఎలా? 365 రోజులూ విధి నిర్వహణలోనే ఉంటే కుటుంబంతో గడిపేది ఎప్పుడు? కొంచెమైనా మానవత్వంతో ఆలోచించకపోతే ఎలా? మనందరి ప్రభుత్వం రాగానే వారంలో ఒక్కరోజు పోలీసులకు కచ్చితంగా సెలవు ఇచ్చి తీరుతాం
అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్రెడ్డి సోదరుడు తోపుదుర్తి రాజశేఖర్రెడ్డి అలియాస్ రాజారెడ్డి అరాచకాలు, దౌర్జన్యాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి.
‘రండి బాబూ రండి.. సొంత పార్టీ నాయకులైతేనేం.. పార్టీ మారి పక్క పార్టీలోకి పోయినవారైతేనేం.. ఓటు అమ్ముకునేవారైతేనేం.. ఆఫర్ ఓకే చేయండి.. మొదటి విడతగా అడిగినంత అందుకోండి.. రెండు విడతలో మరోసారి జేబు నింపుకోండి..’ రెండు జిల్లాల్లో వైసీపీ నాయకులు బహిరంగంగానే పెడుతున్న బేరాలివి. సాధారణంగా ఎన్నికల ముందు డబ్బు పంపిణీ జరుగుతుంటుంది. గెలుపు మీద ఆశలు వదులుకున్నారో లేక ఇక లాభం లేదు అనుకున్నారో పక్కా ప్రణాళికతో విడతలవారీగా ఇప్పటి నుంచే రూ.కోట్లు వెదజల్లేస్తున్నారు.
ఐపీఎల్ 2024లో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుచుకోవడానికి కీలకమైన మ్యాచ్లో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్లు చెలరేగారు. సన్రైజర్స్ హైదరాబాద్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. ముఖ్యంగా కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 54 బంతుల్లో 98 పరుగులు బాదడంతో నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి చెన్నై 212 పరుగులు చేసింది.
మే 13న ఆంధప్రదేశ్ రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ అవుతుందని టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అన్నారు. జగన్ పాలనలో ఎవ్వరికీ స్వేచ్ఛ లేదని మండిపడ్డారు. ఇసుక, మద్యం, గ్రావెల్, భూ సంపదను దోపిడీ చేశారని ధ్వజమెత్తారు. జగన్ పాలనలో ఏ కులానికి, మతానికి మంచి జరగలేదని విమర్శించారు. ‘‘జగన్కు డ్రైవింగ్ రాదు. రివర్స్ గేర్లో వెళ్లి రాష్ట్రాన్ని యాక్సిడెంట్ చేశాడు. మాటలు చెప్పి బటన్ నొక్కితే ఆదాయం పెరగదు’’ అన్నారు.