Home » Andhra Pradesh » Visakhapatnam
జిల్లాలో వెనుకబాటుతనం, వ్యవసాయమే జీవనాధారంగా బతికే ప్రజలు ఉన్న చోడవరం, మాడుగుల ప్రాంతాలకు ఏం చేస్తామనే హామీ గానీ, ఈ ప్రాంత ప్రజల సమస్యల పరిష్కారానికి ఏం చేస్తామనే భరోసా గానీ ఇవ్వకుండానే చోడవరంలో సీఎం జగన్ ఎన్నికల ప్రచార సభ చప్పగా ముగిసిపోయింది. సోమవారం ఉదయం 11 గంటలకు పట్టణంలోని కొత్తూరు జంక్షన్లో నిర్వహించిన రోడ్షో ప్రచార సభ కేవలం ప్రతిపక్ష నేతలు చంద్రబాబు, పవన్ కల్యాణ్లను విమర్శించడమే లక్ష్యంగా కొనసాగిన తీరు సభకు హాజరైన పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలను తీవ్ర నిరాశకు గురిచేసింది.
మండలంలో భూగర్భ జలాలు అడుగంటుతున్నాయి. ఏడు నెలలుగా తగిన వర్షాలు లేక చెరువులు, కాలువలు ఎండిపోతున్నాయి. దీని వల్ల గ్రామాల్లో ఉన్న చెరువులన్నీ పూర్తిగా బీళ్లుగా మారాయి.
సార్వత్రిక ఎన్నికల పోరులో నిలిచేదెవరో తేలిపోయింది. అనకాపల్లి జిల్లాలో లోక్సభ, అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీలో ఉండేవారు ఎవరనేదానిపై స్పష్టత వచ్చింది. సోమవారంతో నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగిసింది. బరిలో నిలిచే అభ్యర్థులను అధికారులు ప్రకటించారు. వీరికి గుర్తులను కూడా కేటాయించారు. ఎన్నికల బరిలో అనేక రాజకీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు ఉన్నప్పటికీ ఈసారి ప్రధాన పోటీ కూటమి, వైసీపీ అభ్యర్థుల మధ్యే ఉండనుంది.
టీడీపీ స్థానిక అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తగా ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్సీ బుద్ద నాగజగదీశ్వరరావును నియమిస్తూ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు ఉత్తర్వులు జారీ చేశారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు బరిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలకు పార్టీ సీనియర్ నేతలను అసెంబ్లీ ఎన్నికల సమన్వయకర్తలుగా నియమిస్తున్నారు.
దేశంలోనే అతి పెద్ద బెల్లం మార్కెట్గా పేరొందిన అనకాపల్లి మార్కెట్ నేడు వెలవెలబోతోంది. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో ఏటా చెరకు పంట విస్తీర్ణం తగ్గిపోయి బెల్లం దిగుమతులు పడిపోయాయి. తమది రైతు సంక్షేమ ప్రభుత్వం అని గొప్పలు చెప్పుకుంటున్న వైసీపీ.. చెరకు రైతులకు చేసిందేమీ లేదని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తోంది. 2018-19 సీజన్లో అనకాపల్లి మార్కెట్కు 22,23,746 బెల్లం దిమ్మలు రాగా, 2023-24 సంవత్సరం సీజన్లో 7,52,457 దిమ్మలు మాత్రమే దిగుమతి అయ్యాయంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. బెల్లం రైతులను ఆదుకుంటామని గత ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చాక మరిచిపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అనకాపల్లి జిల్లా చోడవరంలో సోమవారం ముఖ్యమంత్రి జగన్ బహిరంగ సభ ఉంటే జి.మాడుగుల మండలంలో ఉండే ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు సాగిన ధర్మాన పడాల్ను పోలీసులు అరెస్టు చేశారు. జి.మాడుగుల మండలం గెమ్మెలి పంచాయతీ మద్దులబంధ గ్రామంలో ఉదయం ఆరు గంటలకే ధర్మాన పడాల్ను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు.
అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజక వర్గం, కొత్తూరులో సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబబుపై కామెంట్స్ చేశారు.
విశాఖ స్టీల్ప్లాంటును ప్రైవేటీకరించేందుకు కేంద్రం సిద్ధమవుతున్నా సీఎం జగన్మోహన్రెడ్డి పట్టనట్టు వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు.
పొలిటకల్ నర్సరీగా పేర్గాంచి, రాజకీయ దిగ్గజాలను అందించిన పురిటిగడ్డగా పెందుర్తి నియోజకవర్గం చరిత్ర కెక్కింది.
నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం తుదిగడువు.