నామినేషన్ల ఉపసంహరణకు నేడే తుదిగడువు
ABN , Publish Date - Apr 29 , 2024 | 01:37 AM
నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం తుదిగడువు.
పోటీలో ఉన్న అభ్యర్థులకు సాయంత్రం ఆరు గంటలకు గుర్తులు కేటాయింపు
విశాఖపట్నం, ఏప్రిల్ 28 (ఆంధ్రజ్యోతి):
నామినేషన్ల ఉపసంహరణకు సోమవారం తుదిగడువు. మధ్యాహ్నం మూడు గంటలలోగా నామినేషన్లు ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. జిల్లాలో గల ఒక లోక్సభ నియోజకవర్గానికి 33 మంది, ఏడు అసెంబ్లీ స్థానాలకు 119 మంది నామినేషన్లు దాఖలు చేసిన విషయం విదితమే. అయితే వీరిలో ఎంతమంది బరిలో ఉంటారు?, ఎంతమంది ఉపసంహరించు కుంటారు? అనేది సోమవారం సాయంత్రం నాలుగు గంటలకల్లా తేలనున్నది. కాగా బరిలో ఉన్న అభ్యర్థులకు సాయంత్రం ఆరు గంటలకు గుర్తులు కేటాయించనున్నారు. అనంతరం పార్లమెంటు స్థానానికి బరిలో ఉండే అభ్యర్థులతో రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ మల్లికార్జున సమావేశం నిర్వహించనున్నారు.