Share News

CM Jagan: అనకాపల్లి జిల్లాలో సీఎం జగన్ సిద్ధం సభ

ABN , Publish Date - Apr 29 , 2024 | 01:55 PM

అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజక వర్గం, కొత్తూరులో సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబబుపై కామెంట్స్ చేశారు.

CM Jagan: అనకాపల్లి జిల్లాలో  సీఎం  జగన్ సిద్ధం సభ

అనకాపల్లి జిల్లా: చోడవరం నియోజక వర్గం, కొత్తూరులో సోమవారం ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి (CM Jagan) సిద్ధం సభ (Siddam Sabha) నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టీడీపీ అధినేత (TDP Chief), మాజీ సీఎం (Ex CM) చంద్రబబు (Chandrababu)పై కామెంట్స్ (Comments) చేశారు. పదేళ్లుగా రాజధాని ఉండలసిన హైదరాబాద్ .. ఓటుకు నోటు విషయంలో దొరికి ఉమ్మడి రాజధాని నష్ట పోయామన్నారు. ఏపీ (AP)కి ప్రత్యేక హోదా (Special Status) లేదని.. అన్ని సౌకర్యాలు ఉన్నా విశాఖ (Visakha)ను వదిలేసారని విమర్శించారు. చంద్రబాబును నమ్మిన వారి పరిస్థితి గోవిందా గోవిందా.. అవుతుందన్నారు.


చంద్రబాబు ఇప్పుడు సూపర్ సిక్స్ అంటున్నారని, ఇంటింటికి కేజీ బంగారం ఇంటింటికి బెంజ్ కార్ అంటున్నారని, ఇవన్నీ నమ్మొచ్చా.. నమ్మితే కొండచెలు నోట్లో తలకాయ పెట్టినట్లేనని సీఎం జగన్ అన్నారు. బాబు అధికారంలోకి వస్తే వర్షాలు గోవిందా.. కుర్చీ ఎక్కితే రిజర్వాయర్లు గోవిందా.. అని అన్నారు. చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్య మంత్రిగా చేశారని, అప్పుడు పెట్టిన పధకాలు ఒక్కటైన గుర్తుకొస్తాయా? అని ప్రశ్నించారు. 2014 లో ఇచ్చిన హామీలు ఎంత వరకు అమలు చేసారన్నారు. మీ బిడ్డ జగన్ 2.75 లక్షల కోట్ల రూపాయలు నేరుగా సంక్షేమం.. లబ్దిదారుల ఖాతాల్లోకి వెళుతోందని జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

టీడీపీ ఎంపీ నివాసంలో సోదాలు..

అవినీతి తప్ప అభివృద్ధి లేదు: బోండా ఉమ

లోక్ సభ ఎన్నికల ఆరో దశకు నోటిఫికేషన్ విడుదల

వచ్చేది హంగ్.. మనమే కింగ్.. కేసీఆర్

బాపట్ల జిల్లాలో వైసీపీకీ షాక్..

మే 13న రాష్ట్రానికి పట్టిన పీడ విరగడ: నారా చంద్రబాబు

ఓట్ల వేటలో రూ.కోట్లు.. బేరం చేస్తున్న వైసీపీ

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - Apr 29 , 2024 | 01:58 PM