Home » Andhra Pradesh » Srikakulam
సార్వత్రిక ఎన్నికల్లో కీలక ఘట్టమైన నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ సోమవారం ముగిసింది. అభ్యర్థుల లెక్క తేలింది. ఇక అసలు సమరం మొదలుకానుంది. శ్రీకాకుళం లోక్సభ స్థానానికి గానూ 13 మంది, జిల్లాలో 8 అసెంబ్లీ నియోజకవర్గాలకుగానూ 73 మంది.. మొత్తంగా 86 మంది అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలిచారు.
ఉద్దానంలో కొబ్బరి రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆరేళ్ల కిందట వచ్చిన తితలీ తుఫాన్ దెబ్బకు పంట అంతా నాశనమైంది. కొబ్బరి పంటను కాపాడి.. రైతులను ఆదుకుంటామన్న నేతల హామీలు ప్రకటనలకే పరిమితమవుతున్నాయి.
ఎన్నికల ప్రచారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం మండలం కుందువానిపేటలో సోమవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి వద్ద రూ.29.50లక్షల నగదును సర్వేలైన్స్ బృందం పట్టుకుంది.
ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లను ఎన్నికల విధులకు వినియోగించేందుకు ప్రతి పాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ మన్జీర్ జిలానీ సమూన్ అధికారులను ఆదే శించారు.
ఐదేళ్ల వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, రానున్న ఎన్నికల్లో ఆ పార్టీకి చరమగీతం పాడాలని ఎంపీ కింజరాపు రామ్మో హన్ నాయుడు, ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్ అన్నారు.
సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు గెలిచి రాష్ర్టాన్ని కాపాడుకోవాలని ఆమదాలవలస నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి కూన రవికుమార్ కోరారు.
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో చట్టసభల్లో ప్రవేశించిన పలువురు తొలుత స్థానిక సంస్థల్లో వివిధ రకాల పదవులు అలంకంచారు. తొలి అడుగు గ్రామీణ, పట్టణ స్థానిక సంస్థల నుంచే పడింది. శాసనసభకు ఎన్నికై మంత్రులుగా కూడా ప్రాతినిధ్యం వహించారు. జడ్పీ చైర్మన్లగా పనిచేసిన పలువురు ఎమ్మెల్యేలుగా ఎన్నికై మంత్రి పదవులను సైతం అలంకరించారు. విజయనగరం జిల్లా ఏర్పాటు కాక ముందు ఆ ప్రాంతం కూడా శ్రీకాకుళం జిల్లాలో అంతర్భాగంగానే ఉండేది. అక్కడి ప్రజాప్రతినిధులు కూడా తొలుత స్థానిక సంస్థల్లోనే ప్రాతినిధ్యం వహించారు.
అద్దెకు కార్యకర్తలు దొరుకుతారన్న మాట వినడానికి ఆసక్తిగా ఉన్నా వాస్తవమే. గతంలో రాజకీయపార్టీల నాయకులు స్వచ్ఛందంగా పిలిస్తే గ్రామీణ ప్రాంతాల నుంచి ప్రచారానికి వచ్చే వారు. ప్రస్తుతం ప్రజల ఆలోచన ధోరణి, వ్యవహార శైలి మారింది. ప్రతి పని డబ్బుతోనే ముడిపడి ఉంటున్నాయి. దీంతో రాజకీయ పార్టీల ప్రచారానికి డబ్బులు ఇవ్వనిదే ముందుకురావడం లేదు. జిల్లాలో ఇటీవల కాలంలో ఓ ప్రాంతంలో రెండు ప్రధాన పార్టీలు నిర్వహించిన ర్యాలీలు, సభలకు వచ్చిన వారే మళ్లీ రావడం విశేషం. దీంతో ఆయా పార్టీల అభ్యర్థులు తమకు ఓటు వేస్తారోలేదనని సందేహం వ్యక్తంచేస్తున్నారు.
సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ఏవైనా ఇబ్బందులుంటే తెలియజేయాలని ఎన్ని కల పరిశీలకుడు సందీప్ శర్మ వివిధ పార్టీల నేతలను అన్నారు.