Share News

ధర్మాన అనుచరుల దౌర్జన్యం

ABN , Publish Date - Apr 30 , 2024 | 12:23 AM

ఎన్నికల ప్రచారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం మండలం కుందువానిపేటలో సోమవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

ధర్మాన అనుచరుల దౌర్జన్యం

శ్రీకాకుళం రూరల్‌, ఏప్రిల్‌ 29: ఎన్నికల ప్రచారంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు అనుచరులు దౌర్జన్యానికి పాల్పడ్డారు. శ్రీకాకుళం మండలం కుందువానిపేటలో సోమవారం మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాలనీలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ సూరాడ అప్పన్న ఇంటి వద్ద ప్రచారరథాన్ని నిలిపారు. ఆ సమయంలో అప్పన్న ఇంటి ముందు ద్విచక్రవాహనం ఉండగా.. దానిని పక్కకు తీయాలని ఓ వైసీపీ నాయకుడు మైక్‌లో చెప్పారు. దీంతో వాహనదారుడు వచ్చి ద్విచక్రవాహనాన్ని పక్కకు తీస్తుండగా.. మంత్రి ధర్మాన అనుచరుడు ఒకరు తిట్ల దండకాన్ని అందుకున్నాడు. మంత్రి దగ్గర మెప్పు పొందేందుకు వాహనదారుడిపై దౌర్జన్యానికి పాల్పడ్డాడు. ప్రచార రథంపై ధర్మాన ఉన్నారంటూ.. కొంతమంది అనుచరులు వాహనదారుడిని పక్కకు నెట్టేశారు. ఇంత జరుగుతున్నా.. ధర్మాన వారిని సముదాయించలేదంటూ స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంత అధికార అహంకారం ఉండకూడదని, ఐదేళ్లలో ఎటువంటి అభివృద్ధి పనులు చేపట్టకుండా.. ఓట్లు అడగానికి ఎలా వచ్చారంటూ పలువురు గుసగుసలాడుకున్నారు.

Updated Date - Apr 30 , 2024 | 12:24 AM