Home » Andhra Pradesh » Kurnool
కర్నూలు జిల్లా: ఎన్నికల ప్రచారంలో భాగంగా తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు రెండో రోజు సోమవారం కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. గూడూరులో ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు టీడీపీ నేతలతో సమావేశమవుతారు. తర్వాత డోన్ పాత బస్టాండ్లో సాయంత్రం 3 గంటల నుంచి 4:30 గంటల వరకు ప్రజాగళం సభలో పాల్గొంటారు.
సీఎం జగన్ జగనాసుర రక్త చరిత్ర చార్జిషీట్ను బనగానపల్లె టీడీపీ అభ్యర్థి బీసీ జనార్దన్రెడ్డి, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాటసాని చంద్రశేఖర్రెడ్డి ఆదివారం బనగానపల్లెలో విడుదల చేశారు.
టీడీపీని గెలిపించాలని ఆ పార్టీ ఆళ్లగడ్డ అసెంబ్లీ అభ్యర్థి భూమా అఖిలప్రియ కోరారు.
అహోబిలంలో అటవీ సిబ్బందికి, భక్తులకు ఆదివారం వాగ్వాదం జరిగింది.
చాగలమర్రి గ్రామంలోని టోల్ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్పోస్టులో ఆదివా రం ఎస్ఎస్టీ టీమ్ అధికారి తులసీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్ఐ సురేష్, పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కంచి పట్టు చీరలు పట్టుబడ్డాయి.
కౌతాళం జనంతో కిక్కిరిసింది.. గూడూరులో తెలుగు తమ్ముళ్లు కదం తొక్కారు..
డోన్ నియోజకవర్గంలో మంత్రి బుగ్గన చెబుతున్న అభివృద్ధి అంతా జేబులు నింపుకోవడానికే తప్ప.. ప్రజలకు ఒరిగిందేమీ లేదని డోన్ టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి విమర్శించారు.
విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అర్హత పరీక్ష ఏపీ సెట్ ప్రశాంతంగా జరిగింది.
జిల్లాలోని లబ్ధిదారులు తమ పింఛన్ కోసం గ్రామ, వార్డు సచివాలయాలకు రావాల్సిన అవసరం లేదని, ఇండ్లకే వచ్చి పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ జి. సృజన అన్నారు.
సాధారణ ఎన్నికల బ్యాలెట్ పేపర్ల ప్రింటింగ్ ప్రక్రియను నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డా.జి. సృజన అధికారులను ఆదేశించారు.