ప్రశాంతంగా ఏపీ సెట్
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:20 AM
విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అర్హత పరీక్ష ఏపీ సెట్ ప్రశాంతంగా జరిగింది.
కర్నూలు(అర్బన్), ఏప్రిల్ 28: విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కళాశాలల అధ్యాపకుల అర్హత పరీక్ష ఏపీ సెట్ ప్రశాంతంగా జరిగింది. ఆదివారం నగరంలోని 9 పరీక్షా కేంద్రాల్లో 3,883 మంది అభ్యర్థులు పరీక్షలకు దరఖాస్తు చేసుకోగా పేపర్ 1, 2 మొత్తం 3,172 మంది హాజరయ్యారు. 711 మంది గైర్హాజరయ్యారు. స్పెషల్ అబ్జర్వరు ప్రొఫెసర్ బాయినేని శ్రీనివాసులు, కర్నూలు రీజియన్ కోఆర్డినేటర్, ప్రొఫెసర్ ఎన్టీకే నాయక్ పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్ష జరిగిన తీరును పరిశీలించారు.