Share News

కంచిపట్టు చీరల స్వాధీనం

ABN , Publish Date - Apr 29 , 2024 | 12:23 AM

చాగలమర్రి గ్రామంలోని టోల్‌ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులో ఆదివా రం ఎస్‌ఎస్‌టీ టీమ్‌ అధికారి తులసీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్‌, పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కంచి పట్టు చీరలు పట్టుబడ్డాయి.

కంచిపట్టు చీరల స్వాధీనం

చాగలమర్రి, ఏప్రిల్‌ 28: చాగలమర్రి గ్రామంలోని టోల్‌ ప్లాజా వద్ద ఏర్పాటు చేసిన జిల్లా సరిహద్దు చెక్‌పోస్టులో ఆదివా రం ఎస్‌ఎస్‌టీ టీమ్‌ అధికారి తులసీకృష్ణ ఆధ్వర్యంలో ఎస్‌ఐ సురేష్‌, పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా కంచి పట్టు చీరలు పట్టుబడ్డాయి. కడప జిల్లా నుంచి నంద్యాల వైపు వెళ్తున్న వాహనాలు తనిఖీ చేస్తుండగా రూ.50 లక్షలు విలువ చేసే కంచి పట్టు చీరలు పట్టుబడ్డాయని, వాటిని చాగలమర్రి పోలీసు స్టేషన్‌కు స్వాధీనం చేసినట్లు చాగలమర్రి ఎస్‌ఐ రమణయ్య తెలి పారు. కంచి పట్టు చీరలకు సంబంధించిన పత్రాలను పరిశీలించి విచారణ చేస్తున్నామని ఎస్‌ఐ చెప్పారు.

Updated Date - Apr 29 , 2024 | 12:23 AM