Home » Andhra Pradesh » Krishna
Andhrapradesh: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వానికి సుప్రీం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ఇసుక అక్రమ తవ్వకాలపై ఉన్నతన్యాయస్థానం మండిపడింది. అక్రమ ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని జగన్ సర్కార్ను సుప్రీం ఆదేశించింది. ఎన్జీటీ తీర్పును యథాతధంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. అనుమతులు లేకుండా చేపట్టిన ఇసుక తవ్వకాలను వెంటనే నిలిపివేయాలని సుప్రీం ధర్మాసనం ఆర్డర్స్ పాస్ చేసింది.
కృష్ణా యూనివర్సిటీ అధికారులు, ప్రొఫెసర్ల మధ్య యుద్ధం రచ్చకెక్కింది. వర్సిటీలో తనను వేధిస్తున్నారని, అదేమని అడిగితే ప్రభుత్వ పెద్దల సూచనలతోనే ఇదంతా జరుగుతోందం టున్నారని, తాను ఈ నెల 30న యూనివర్సిటీ ఎదుట శాంతియుత పోరాటం చేస్తానని సీనియర్ ప్రొఫెసర్ ఎంవీ బసవేశ్వరరావు యూనివర్సిటీ అధికారులకు శనివారం లేఖ రాయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఆయన రాసిన లేఖలోని వివరాలు..
‘రండి బాబూ రండి.. సొంత పార్టీ నాయకులైతేనేం.. పార్టీ మారి పక్క పార్టీలోకి పోయినవారైతేనేం.. ఓటు అమ్ముకునేవారైతేనేం.. ఆఫర్ ఓకే చేయండి.. మొదటి విడతగా అడిగినంత అందుకోండి.. రెండు విడతలో మరోసారి జేబు నింపుకోండి..’ రెండు జిల్లాల్లో వైసీపీ నాయకులు బహిరంగంగానే పెడుతున్న బేరాలివి. సాధారణంగా ఎన్నికల ముందు డబ్బు పంపిణీ జరుగుతుంటుంది. గెలుపు మీద ఆశలు వదులుకున్నారో లేక ఇక లాభం లేదు అనుకున్నారో పక్కా ప్రణాళికతో విడతలవారీగా ఇప్పటి నుంచే రూ.కోట్లు వెదజల్లేస్తున్నారు.
క్రైస్తవుల సమస్యలు పరిష్కరిస్తానని, వారి అభ్యున్నతికి పాటుపడతానని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి సుజనా చౌదరి హామీ ఇచ్చారు.
ఆర్థిక ఇబ్బందులు తాళలేక కృష్ణలంకకు చెందిన కాటూరి నరేంద్ర(36) అనే లిఫ్ట్ మెకానిక్ శనివారం రాత్రి ఇంటిలో ఆత్మహత్య చేసుకున్నాడు.
సీఎం జగన్ దొంగ అని, ఆయనకు హత్యలు చేసే మనస్తత్వం ఉందని సొంత చెల్లి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగంగా చెబుతోందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు.
‘‘నలభైఏళ్ల రాజకీయ జీవితంలో నాకు తెలిసి ఎవరికీ చెడు చేయలేదు. భవిష్యత్తులోనూ చేయను. నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి.’’ అని ఓటర్లను టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ కోరారు.
ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, సచివాల యాలనతాకట్టు పెట్టిన జగన్కు చివరకు ప్రజల ఆస్తులపై కన్ను పడిందని దాని కుట్రలో భాగమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పెడు తున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆరోపించారు.
పెన మలూరు నియోజకవర్గానికి ఈశాన్య గ్రామం గా భావిస్తున్న ముదునూరులో వైసీపీకి భారీగా షాక్ తగిలింది. గ్రామానికి చెందిన పలువురు నాయకులు, ప్రముఖులు, కార్యకర్తలు ఆ పార్టీకి గుడ్బై చెప్పి తెలుగుదేశం, జనసేన పార్టీల్లో చేరు తున్నారు. దీంతో ఆ పార్టీ నాయకుల్లో కలవరం మొదలైంది.
గన్నవరం నియోజకవర్గంలో ప్రజలకు సేవ చేయడానికి, మేలు చేయడానికి మాత్రమే రాజకీయాల్లోకి వచ్చాను తప్ప ప్రజల్ని దోచుకోవడానికి, వేధించడానికి తాను రాజకీయాల్లోకి రాలేదని గన్నవరం నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు స్పష్టం చేశారు.