జగన్ దొంగ అని సొంత చెల్లే చెబుతోంది: గద్దె రామ్మోహన్
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:42 AM
సీఎం జగన్ దొంగ అని, ఆయనకు హత్యలు చేసే మనస్తత్వం ఉందని సొంత చెల్లి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగంగా చెబుతోందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు.
మాచవరం: సీఎం జగన్ దొంగ అని, ఆయనకు హత్యలు చేసే మనస్తత్వం ఉందని సొంత చెల్లి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల బహిరంగంగా చెబుతోందని టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే విజన్ ఉన్న నేత చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకుం దామని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు. 6వ డివిజన్లోని నిమ్మతోట, బాలభాస్కర్నగర్ కొండ ప్రాంతాల్లో ఆదివారం ఆయన ఎన్నికల ప్రచా రాన్ని నిర్వహించారు. జగన్ ప్రకటించిన మేనిఫెస్టోతో ఆయన ఎంత మోసకారో ప్రజలకు అర్థమైందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రూ.4 వేలు పింఛన్ అందిస్తామని తెలిపారు.