ప్రజల ఆస్తులపై జగన్ కన్ను
ABN , Publish Date - Apr 29 , 2024 | 12:36 AM
ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, సచివాల యాలనతాకట్టు పెట్టిన జగన్కు చివరకు ప్రజల ఆస్తులపై కన్ను పడిందని దాని కుట్రలో భాగమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పెడు తున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆరోపించారు.
అందుకే ల్యాండ్ టైటిలింగ్ చట్టం
ఆస్తులకు రక్షణ కావాలంటే కూటమికి ఓటేయండి: గద్దె అనురాధ
పటమట: ప్రభుత్వ కార్యాలయాలు, భూములు, సచివాల యాలనతాకట్టు పెట్టిన జగన్కు చివరకు ప్రజల ఆస్తులపై కన్ను పడిందని దాని కుట్రలో భాగమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను పెడు తున్నారని జడ్పీ మాజీ చైర్పర్సన్ గద్దె అనురాధ ఆరోపించారు. 11వ డివిజన్లో తంగెళ్లమూడివారి వీధి, యలమంచిలి కుటుం బయ్య పార్కు ప్రాంతాల్లో ఎమ్మెల్యేగా గద్దె రామ్మోహన్, ఎంపీగా కేశినేని శివనాథ్(చిన్ని)ని గెలిపించాలని ఆదివారం ఆమె ఎన్నికల ప్రచారం చేశారు. మన ఆస్తులకు రక్షణ కావాలంటే కూటమికి మద్దతిచ్చి చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలన్నారు. గద్దె హేమాన్షు, కోనేరు రాజేష్, పామర్తి కిషోర్, దేవరపల్లి ఆంజనేయులు, మీసాల నాగేంద్ర, కోనేరు రాధాకృష్ణ, పాలడుగు దుర్గాప్ర సాద్, బి.మురళి పాల్గొన్నారు.