Home » Telangana » Warangal
జిల్లాలో అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో స్వల్ప నుంచి మోస్తరు వానలు కురిశాయి. బలమైన ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జిల్లాలో ఆయా ప్రాంతాల్లో చేలల్లో వరి పంటలు నేలకొరిగాయి.
అనేక రకాల పోషకాలు లభిస్తాయనే నమ్మకం తో అందరూ పాలు తాగుతారు. ముఖ్యంగా పిల్లలు, అనారోగ్యం బారిన పడినవారు, బలహీనంగా ఉన్నవారు పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తుంటారు. కానీ పాలు సైతం విషతుల్యమవుతున్నాయనేది చేదునిజం. అధిక పాల ఉత్సత్తి కోసం పాడి పశువుల డెయిరీలను నిర్వహిం చే వారు అడ్డదారులు తొక్కుతున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదానికి సుప్రీంకోర్టు(Supreme Court Of India) ముగింపు పలికింది. భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలోని కొంపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 171లో ఉన్న 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీశాఖకే చెందుతుందని తీర్పు చెప్పింది.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.
నామినేషన్ల పర్వం మొదలైంది. పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగడంతో పాటు ఓ వైపు కేడర్ను కలుస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్తూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అధినాయకత్వాలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదను పెడుతున్నాయి.
Telangana: పోలీస్స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్స్టేషన్లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్ స్టేషన్లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్స్టేషన్లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.
జిల్లాలోని బడులకు సౌర సొబగులు అందించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. పలు పాఠశాలల్లో సౌరశక్తి ద్వారా సోలార్ పవర్ను అందించేందుకు తెలంగాణ రాష్ట్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ (టీఎస్ రెడ్కో) ఏర్పాట్లు చేస్తోంది. సర్కార్ స్కూళ్లల్లో సౌరశక్తిని ఉపయోగించుకొని, నిరం తరం కరంట్ సరఫరా అందించడంతో పాటు బిల్లుల భారాన్ని తొలగించేందుకు సోలార్ విద్యుత్ వ్యవస్థలను ఏర్పాటు చేస్తున్నారు.
ఇన్నాళ్లుగా వికసించిన పైర్ల పచ్చదనం.. ఈ ఏడాది నీళ్ల కరువుతో పటాపంచలై అన్నదాతను అప్పులపాల్జేస్తోంది. తాతల కాలం నుంచి నమ్ముకున్న వ్యవసాయం ఇప్పుడుప్పుడే గాడినపడుతుందనుకున్న ఆనందం.. అంతలోనే తిరగబడి పాడు జ్ఞాపకాలను గుర్తు చేస్తోంది. పదిహేనేళ్ల క్రితం మసకబారిన కరువు మళ్లీ దర్శనమిస్తూ అన్నదాతను ఆందోళనకు గురిచేస్తోంది.
జనగామ వ్యవసాయ మార్కెట్లో ధాన్యం, ఇతర పంట ఉత్పత్తు ల కొనుగోలుపై సస్పెన్స్ నెలకొంది. ఈనెల 10న జరిగిన ఘటన నేపథ్యంలో ట్రేడర్లు కొనుగోళ్లకు దూరంగా ఉన్నారు. తమపై పెట్టిన కేసులను ఎత్తివేసి హమాలీల సమస్యను పరిష్కరించే వరకు కొనుగోళ్లు జరపబోమని భీష్మించుకుకూర్చున్నారు.
జలమే జగతికి మూ లం.. అలాంటి జలం గరళమవుతోంది.. జిల్లా వ్యాప్తం గా తాగునీటి వ్యాపారం జోరుగా సాగుతోంది. వేసవి కాలం కావడంతో ‘మూడు ప్లాంట్లు... ఆరు క్యాన్లు’ అనే తరహాలో దినదినాభివృద్ధి చెందుతోంది. పుట్టగొడు గుల్లా వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తూ ఎలాంటి అనుమతులు లేకుండానే నిర్వాహకులు లక్షలు సంపా దిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు.