ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుందరమైన పర్యాటక ప్రదేశం పాకాల.
మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం అర్పణపల్లి గ్రామంలో ఓ మొసలి కలకలం రేపింది. గ్రామ సమీపంలోని ఓ వ్యవసాయ బావిలో మొసలి ప్రత్యక్షం కావడంతో స్థానిక రైతులు, గ్రామస్థులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
బీఆర్ఎస్ పాలనలో పేద ప్రజలను చూసుకుంటే... కాంగ్రెస్ నేతలు పెద్దలను చూసుకుంటున్నారని మాజీ మంత్రి కేటీఆర్ విమర్శించారు. కాంగ్రెస్ చెప్పిన అబద్దాలను నమ్మి.. ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టంకట్టారన్నారు.
SIR పేరిట దేశంలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోందని.. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. నాడు ఓటును జోడించే కార్యక్రమం జరిగితే.. నేడు ఓటును తొలగించే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు.
మహబూబాబాద్ జిల్లా బయ్యారం మండల కేంద్రంలోని కాకతీయనగర్లో అడవి జంతువుల మాంసం విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. అయితే అధికారుల రాకను గమనించిన కొందరు స్మగ్లర్లు అక్కడి నుంచి పరారయ్యారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని గణపురం మండలం చెల్పూరులో వాహనాల తనిఖీలు చేస్తున్న సమయంలో ఆర్టీవో వెంకన్నపై లారీ దూసుకెళ్లడంతో మృతిచెందారు.
ప్రాణాంతకమైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండ బాలుడు నిరంజన్ ఇంటికి బండ్ల గణేష్ వెళ్లారు. నిరంజన్తో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. పరమేశ్వర ఆర్ట్స్ ప్రొడక్షన్ తరఫున ఐదు లక్షల రూపాయల చెక్ను నిరంజన్ తల్లిదండ్రులకు అందజేశారు.
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ ధాన్యం ధరలు రోజురోజుకు పెరుగుతూ ఉన్నాయి.
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది.
నాణ్యమైన విత్తనాల సరఫరాలో ముల్కనూర్ బ్యాంకు అగ్రగామిగా నిలుస్తోంది.