ఉమ్మడి వరంగల్ జిల్లాలో వంట నూనెల ధరలు సలసల కాగుతున్నాయి. లీటర్పై రూ. 30 వరకు పెరిగాయి. యుద్ధం సాకుచూపి కొందరు వ్యాపారులు కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు.
ములుగు జిల్లాలో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. గుంపులు గుంపులుగా తిరుగుతూ కనిపిం చిన వారిని ఉన్నట్టుండి దాడి చేస్తూ గాయరుస్తున్నాయి.
వరంగల్ జిల్లాలో నమోదవుతున్న అత్యధిక ఉష్ణోగ్రతలతో మనుషులే కాదు మూగ జీవా లు సైతం బెంబేలెత్తుతున్నాయి.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో జరిగిన ఈ ఘటన అత్యంత విషాదకరం. కోతుల దాడిలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది.
ప్రభుత్వాధికారుల నిర్లక్ష్యం చిన్నారి ప్రాణాలు తీసింది. దీంతో ఆ చిన్నారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. జనగామ జిల్లాలోని బచ్చన్నపేట మండలం ఆలీంపూర్ గ్రామంలో ఎలికట్టే కవిత, శ్రీనివాస్ దంపతులు నివసిస్తున్నారు.
జనగామలో ఈరోజు జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఉద్రిక్తంగా మారింది. మున్సిపల్ వైస్ చైర్మన్ భూష పర్వతాలకు వేదికపై కుర్చీ ఇవ్వలేదని ఆరోపిస్తూ బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు.
వారం రోజుల్లో పెళ్లి ఉందనగా కాబోయే భార్యను హత్య చేశాడో యువకుడు. అజ్మీరా అరవింద్ అనే వ్యక్తికి భూక్యా సంగీతతో ఈనెల 29న పెళ్లి నిశ్చయించారు పెద్దలు.
ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ స్వగ్రామం ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆధ్వర్యంలో శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తీసుకెళ్లేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శంకర్ గౌడ్ కుటుంబానికి అండగా ఉంటామని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సమస్యలు పరిష్కరించాలంటూ గురువారం నాడు ఆత్మహత్యాయత్నం చేసిన నర్సంపేట ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతిచెందారు.