ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 12 మున్సిపాలిటీల్లో చైర్మన్, వైస్ చైర్మన్ల ఎన్నిక లాంఛనం కానుంది. అలాగే ఇండిపెండెంట్లు, ఎక్స్ అఫీషియో ఓటుతో అధికార కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ మున్సిపాలిటీని దక్కించుకొంది.
జనగామ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ వద్ద హైటెన్షన్ నెలకొంది. ఇండిపెండెంట్ అభ్యర్థి కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
తెలంగాణలో మున్సిపల్ కౌంటింగ్కు ముందు రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ముఖ్యంగా వరంగల్ ఉమ్మడి జిల్లా, నిజామాబాద్లో క్యాంప్ పాలిటిక్స్ హాట్ టాపిక్గా మారింది. అధికార కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల మధ్య వ్యూహాత్మక పోటీ మరింత తీవ్రతరమైంది. అభ్యర్థులను ప్రత్యర్థి పార్టీల ప్రలోభాలకు గురికాకుండా ముందస్తు జాగ్రత్తగా రాత్రికి రాత్రే క్యాంపులకు తరలించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న(బుధవారం) మున్సిపల్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈనెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ ఎన్నికల ఫలితాలపై ఓ సర్వే సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
డాడీ నేను ఇక డాన్స్ లేయలేనా ? అన్న కుమారుడి మాటలకు ఓ తండ్రి చలించిపోయి బోరున విలపించాడు. సోమవారం పర్వతగిరి మండలం శ్రీనగర్ గ్రామ శివారులో పాఠశాల బస్సు, ట్రాక్టర్ ఢీకొన్న ఘటనలో కొంకపాక గ్రామానికి చెందిన రాజు కుమారుడు హర్షిత్ (10) తీవ్రంగా గాయపడ్డాడు.
తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. పోలింగ్ వేళ పలు జిల్లాల్లో స్వల్ప ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి.
సీఎం రేవంత్రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. నాంపల్లి ఫోరెన్సిక్ ల్యాబ్లో జరిగిన అగ్నిప్రమాదంలో ఓటుకు నోటు కేసు సాక్ష్యాలను కాల్చేశారని ఆరోపించారు..
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని రేగొండ మండల పరిధిలో అమానుష ఘటన వెలుగు చూసింది. పొనగండ్ల గ్రామంలో ఎనిమిదేళ్ల పసిపాపపై ఇద్దరు మృగాళ్లు అఘాయిత్యానికి పాల్పడ్డారు.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం తిప్పాపురం గ్రామానికి చెందిన కోరం రామారావు అనే వ్యక్తి సైబర్ నేరగాళ్ల వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
ఓటుకు నోటు కేసు చివరి దశకు వచ్చిన తరుణంలో తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీలో అగ్నిప్రమాదం జరగడంపై కేటీఆర్ సందేహం వ్యక్తం చేశారు. ఈ అగ్నిప్రమాదంపై స్పందించాలంటూ కేంద్ర ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు.