Home » Telangana » Warangal
ములుగు జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా అధికార కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారం ముమ్మరం చేసింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచి జోరుమీదున్న కాంగ్రెస్, సార్వత్రిక ఎన్నికల్లోనూ సత్తా చాటాలని గట్టిగా కృషిచేస్తోంది. ఈ క్రమంలో గిరిజన సంక్షేమశాఖ మంత్రి సీతక్క ములుగు జిల్లా, వెంకటాపురం మండలం, నల్లగుంటలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.
గిరిజనులకు పెద్ద దిక్కుగా ఉన్న ఐటీడీఏ క్రమేపీ తన అస్తిత్వాన్ని కోల్పోతోందా..? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనుల బతుకుల్లో వెలుగులు నింపేందుకు ఏర్పడిన ఐటీడీఏ లక్ష్యానికి దూరంగా వెళ్తుందనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. 32 శాఖల ద్వారా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని గిరిజనుల బతుకులు మార్చేందుకు ఐటీడీఏకు అంకురార్పణ జరగ్గా క్రమేణా కొన్ని శాఖలు పూర్తిగా కనుమరుగయ్యాయి.
Telangana: బీఆర్ఎస్ వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి సుధీర్ కుమార్ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ కార్యక్రమానికి మండలి వైస్ చైర్మన్ బండ ప్రకాష్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి దయాకర్ రావు మాట్లాడుతూ.. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పదేళ్లుగా తెలంగాణకు అన్యాయం చేసిందని విమర్శించారు.
ఏటా గోదావరి వరద ముం పునకు గురవుతున్న ములుగు జిల్లా ఏటూరునాగారం, మంగపేట మండలాల్లోని తీర గ్రామాలకు రక్షణగోడ నిర్మించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. పాలకుల పట్టింపులేని తనానికి.. కాంట్రాక్టు కంపెనీ నిర్లక్ష్యం తోడవ్వడంతో ఈసారి కూడా ముంపు ప్రమాదం పొంచి ఉంది. నిధుల కేటాయింపు, భూసేకరణ లాంటి పలు అవరోధాలను అధిగమించినా పనులు మొదల వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాలో అకాల వర్షం అన్నదాతను ఆగమాగం చేసింది. శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు పలు ప్రాంతాల్లో స్వల్ప నుంచి మోస్తరు వానలు కురిశాయి. బలమైన ఈదురుగాలులకు తోడు ఉరుములు, మెరుపులతో వర్షం పడింది. పలు చోట్ల పిడుగులు పడ్డాయి. ఈదురుగాలులతో కూడిన వర్షం కారణంగా జిల్లాలో ఆయా ప్రాంతాల్లో చేలల్లో వరి పంటలు నేలకొరిగాయి.
అనేక రకాల పోషకాలు లభిస్తాయనే నమ్మకం తో అందరూ పాలు తాగుతారు. ముఖ్యంగా పిల్లలు, అనారోగ్యం బారిన పడినవారు, బలహీనంగా ఉన్నవారు పాలు తాగితే ఆరోగ్యం బాగుంటుందని వైద్యులు సూచిస్తుంటారు. కానీ పాలు సైతం విషతుల్యమవుతున్నాయనేది చేదునిజం. అధిక పాల ఉత్సత్తి కోసం పాడి పశువుల డెయిరీలను నిర్వహిం చే వారు అడ్డదారులు తొక్కుతున్నారు.
దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న భూవివాదానికి సుప్రీంకోర్టు(Supreme Court Of India) ముగింపు పలికింది. భూపాలపల్లి(Bhupalpally) జిల్లా కేంద్రంలోని కొంపల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 171లో ఉన్న 106.34 ఎకరాల భూమి రాష్ట్ర అటవీశాఖకే చెందుతుందని తీర్పు చెప్పింది.
జయశంకర్ భూపాలపల్లి: జిల్లాకు చెందిన మావోయిస్టు నేత సిరిపెల్లి శంకర్రావు అలియాస్ సుధాకర్ అలియాస్ మురళి, ఆయన భార్య దాశేశ్వర్ అలియాస్ సుమన అలియాస్ రంజితల మృతదేహాలు చల్లగరిగ గ్రామానికి చేరుకున్నాయి. మూడు రోజుల క్రితం ఛత్తీస్ గఢ్ ఎన్ కౌంటర్లో సుధాకర్ దంపతులు చనిపోయారు. సుధాకర్ దంపతుల చివరిచూపు కోసం చుట్టు పక్కల గ్రామాల ప్రజలు తరలి వస్తున్నారు.
నామినేషన్ల పర్వం మొదలైంది. పార్టీలు సమరానికి సై అంటున్నాయి. ఇప్పటికే ప్రధాన పార్టీల అభ్యర్థులు ప్రచార పర్వంలోకి దిగడంతో పాటు ఓ వైపు కేడర్ను కలుస్తూ.. మరోవైపు ప్రజల్లోకి వెళ్తూ గెలుపు కోసం సర్వశక్తులు ఒడ్డుతున్నారు. ఈ క్రమంలోనే ఆయా పార్టీల అధినాయకత్వాలు కూడా తమ అభ్యర్థుల గెలుపు కోసం వ్యూహాలకు పదను పెడుతున్నాయి.
Telangana: పోలీస్స్టేషన్ అంటేనే బాధితుల పక్షాన నిలబడే చోటు. ప్రజలు తమ సమస్యలపై ఫిర్యాదులు చేస్తూ న్యాయం చేయాలని కోరుతుంటారు. అయితే జయశంకర్భూపాలపల్లి జిల్లాలోని ఓ పోలీస్స్టేషన్లో జరిగిన సీన్ చూస్తే మాత్రం తిట్టుకోకమానరు. పోలీస్ స్టేషన్లో రోజూలా ఈరోజు (సోమవారం) కూడా పోలీసులు తమ తమ విధులు నిర్వహిస్తుండగా.. ఓ పార్టీకి చెందిన వ్యక్తి అక్కడకు వచ్చాడు. వచ్చిన వ్యక్తి పోలీసులను పలకరించడమే కాకుండా హుషారుగా డ్యాన్స్ చేశాడు. ఇది తప్పు అని చెప్పాల్సిన ఖాకీలు సైతం ఆయనను బాగానే ఎంకరేజ్ చేశారు మరి. అయితే పోలీస్స్టేషన్లో డ్యాన్స్ చేసిన వీడియా బయటకు రావడంతో నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు.