గ్రామపంచాయతీ ఎన్నిక ల్లో భాగంగా మొదటి విడత ఎన్నికల ప్రచారానికి మంగళవారంతో తెరపడింది. గణపురం, రేగొండ, కొత్తపల్లిగోరి, మొగుళ్లపల్లి మండలాలకు ఎన్నికలు జరగనుండగా ఈనెల 11న పోలింగ్ జరగనుంది.
పంచాయతీ ఎన్నికల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకర్షించేందుకు భారీ మొత్తంలో మద్యం, మటన్, విందులతో ప్రచారం చేస్తున్నారు. ఎన్నికల ఖర్చుల్లో ఎక్కువ భాగం మద్యంపైనే వెచ్చిస్తున్నారు. అభ్యర్థులు ప్రలోభాల ద్వారానే అధికంగా ఓట్లు వేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు.
వరంగల్ జిల్లాలో తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ప్రచారం ముగిసిన తర్వాత, అభ్యర్థులు ఓటర్లను ప్రలోభాలకు గురి చేయాలని ప్రయత్నిస్తున్నారు. కాగా అధికారులు పోలింగ్ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. 11న పోలింగ్ జరుగనుంది.
గ్రామాల్లో సర్పంచ్లు, వార్డు సభ్యులు గెలుపు కోసం పడరాని పాట్లు పడుతున్నారు. ఓటర్ల అవసరాలను తీరుస్తూ గెలిస్తే పథకాలు ఇప్పిస్తామని ఆశ చూపుతూ ఓటు వేయాలని కోరుతున్నారు.
హనుమకొండ జిల్లాలో గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి. అభ్యర్థులు నాన్ లోకల్ ఓటర్లను కంటాక్ట్ చేసి ఓటు వేసేందుకు వారిని గ్రామాలకు రప్పిస్తున్నారు. వలస వెళ్లిన వారికి ఫోన్లు చేసి, ఖర్చులు కూడా భరిస్తామని తెలియజేస్తున్నారు.
జనగామ జిల్లాలో పంచాయతీ ఎన్నికలు రాజకీయ పార్టీలకు సవాలుగా మారాయి. ఎక్కువ స్థానాలు గెలుచుకుని తమ సత్తా చాటుకోవాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు శ్రమిస్తున్నారు. ఎమ్మెల్యేలు, ఇంఛార్జిల వ్యూహాలతో ఎన్నికల పోరు మరింత రసవత్తరంగా మారింది.
ఓట్ల కోసం అభ్యర్థులు కోతులను పట్టి.. ఓట్లను కొల్ల గొట్టే ప్రయత్నంలో ఉన్నారు. వల్లెల్లో కోతి చేష్టలతో ప్రజలకు చిరాకు తెప్పిస్తున్నాయి. మందలకు మందలుగా కోతులు పల్లెలను ఆక్రమించుకుంటున్నాయి.
స్థానిక ఎన్నికల తరుణంలో ఇతర ప్రాంతాలలో ఉన్న ఓటర్లపై దృష్టి సారించారు అభ్యర్థులు. దీంతో వలస వెళ్లిన ఓటర్లపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తూ.. వారిని రప్పించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
తెలంగాణకు మోదీ ప్రభుత్వం అన్యాయం చేస్తోందని సీఎం రేవంత్రెడ్డి ధ్వజమెత్తారు. రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తే ఢిల్లీని ఢీకొడతానని హెచ్చరించారు.
తెలంగాణాలో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. రోజుకో రీతిలో ఎత్తుగడలు వేస్తూ సర్పంచ్ అభ్యర్థులు ప్రచారం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా.. భూపాలపల్లి జిల్లాలో వెలసిన ఓ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ ఏమిటా పోస్టర్? అందులో ఏముందంటే.?