ధరణి, భూ భారతి పోర్టల్లో సాంకేతిక లోపాలను అడ్డుపెట్టుకుని ప్రభుత్వ ఖజానాకు రూ.3.90 కోట్ల గండికొట్టిన ముఠా గుట్టురట్టు చేశారు. వరంగల్ పోలీసులు. 15 మందిని అరెస్ట్ చేసి, రూ. 63 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నట్లు సీపీ సన్ప్రీత్ సింగ్ వెల్లడించారు.
సామాజిక కార్యకర్త గాదె ఇన్నయ్యకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో చంచల్గూడ జైలులో ఉన్న ఆయన విడుదల కానున్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహాజాతరకు ఏర్పాట్లను శరవేగంగా జరుగుతున్నాయి. ఈనెల 28 నుంచి 31వరకు జాతర జరగనుంది. అయితే.. పెద్దఎత్తున భక్తులు విచ్చేయనుండడంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు ఇంకా 15 రోజుల గడువు ఉన్నప్పటికీ ప్రస్తుతం మేడారంలో భక్తులు ముందస్తు మొక్కులు సమర్పించుకుంటున్నారు. నిన్న ఒక్కరోజే దాదాపు 30 వేల మంది వరకు భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని అంచనా.
మేడారం సమ్మక్క, సారాలమ్మ జాతర సమీపిస్తోంది. ఈ నేపథ్యంలో జాతర పనులను రాష్ట్ర మంత్రి సీతక్క మంగళవారం పరిశీలించారు.
మావోయిస్టు అగ్రనేత కాటా రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల నేపథ్యంలో గాదె ఇన్నయ్య చేసిన వ్యాఖ్యలను ఎన్ఐఏ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలో ఆయనను అరెస్ట్ చేసింది.
జనగామ జిల్లాను రద్దు చేస్తే.. అగ్నిగుండమే.. అని బీఆర్ఎస్ నాయకుడు. స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అసలు రాష్ట్రంలో రేవంత్ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తోందన్నారు.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతరకు తేదీ దగ్గరపడుతున్నా కొద్దీ ఆయా పనులు ధరవేగంగా జరుగుతున్నాయి. కాగా.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతరకు విచ్చేయనుండడంతో.. ఆయన వచ్చే దారికి మరమ్మతు పనులు జరుగుతున్నాయి.
మేడారం సమ్మక్క-సారలమ్మ మహా జాతర తేదీ దగ్గరపడ్డ తరుణంలో వివిధ పనులన్నీ పూర్తయ్యే దశకు చేరుకున్నాయి. ఈనెల 28, 29, 30 తేదీల్లో మహా జాతర జరగనున్న సంగతి తెలిసిందే. దీంతో భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.
జనగామ జిల్లాలోని జాఫర్ఘడ్లో సామాజిక ఉద్యమకారుడు గాదె ఇన్నయ్యకు చెందిన అనాథాశ్రమంలో మంగళవారం ఉదయం నుంచి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఎన్ఐఏ సిబ్బందితో క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు..