Maoists arrested: పోలీసులకు పట్టుబడిన మావోయిస్టులలో ఒకరు రాష్ట్ర కార్యదర్శి బడే చొక్కారావ్ అలియాస్ దామోదర్ భద్రతాదళంలో పనిచేస్తున్న మావోయిస్టు మడకం చిట్టీ అలియాస్ కీడో (19)గా పోలీసులు గుర్తించారు. ఈనెల 8న కర్రెగుట్టల్లో జరిగిన ఎన్కౌంటర్లో కాలికి బుల్లెట్ గాయం తగిలి చిట్టీ గాయపడ్డాడు.
Drug Control Raids: నిజామాబాద్లో నిషేధిత మత్తు పదార్థం ఆల్ఫాజోలం అమ్ముతున్న ముఠా గుట్టును యాంటీ నార్కోటిక్ డ్రగ్స్ బృందం రట్టు చేసింది. మహారాష్ట్ర కేంద్రంగా ఆల్ఫాజోలం తయారు చేసి తెలంగాణలోని పలు ప్రాంతాల్లో అమ్ముతున్న మూడు కంపెనీలను అధికారులు మూసివేశారు.
Encounter: ఛత్తీస్గఢ్లో గత వారం జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు బుర్రా రాకేష్ మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించే విషయంలో అడ్డంకులు ఏర్పడ్డాయి. దీంతో ఐదు రోజులుగా రాకేష్ మృత దేహం కోసం అతని బంధువులు ఎదురుచూస్తున్నారు.
వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన ఆర్మీ జవాన్ సంపంగి నాగరాజు కశ్మీర్లో విధుల్లో ఉండగా తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య (army jawan suicide) చేసుకున్నాడు. అయితే ఈ విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు. అసలు ఏం జరిగిందనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
Minister Seethakka: దుబ్బగూడం, కొండపర్తి వంటి గ్రామాలకు రహదారులు లేకపోవడం వల్ల కనీసం అంబులెన్స్ వెళ్లే పరిస్థితి లేదని మంత్రి సీతక్క చెప్పారు. అందుకే నిబంధనల పేర ప్రజలను ఇబ్బందులు పెట్టవద్దని మంత్రి సీతక్క సూచించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రజా ప్రభుత్వ నిధులు మంజూరు చేసినా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదని మంత్రి సీతక్క గుర్తు చేశారు.
Konda Surekha: గోరంతలు కొండంతలు చేస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని మంత్రి కొండా సురేఖ మండిపడ్డారు. పూర్తి వీడియోలు ప్రసారం చేయకుండా ఎడిటింగ్తో తప్పుడు ప్రచారాలు చేసి బద్నాం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను మాట్లాడిన దాంట్లో ముందు వెనక కట్ చేసి చిన్న క్లిప్ను కావాలని ట్రోల్ చేస్తున్నారన్నారు.
Saraswati Pushkaralu: సరస్వతి పుష్కర స్నానాలు గురువారం నుంచి ప్రారంభం కావడంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు. పుష్కరస్నానం చేసి కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారిని దర్శించుకుంటున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేపట్టింది.
Miss World Contestants: అందాల భామలు బుధవారం వరంగల్, ములుగు జిల్లాలో పలు దర్శనీయ ప్రాంతాలను సందర్శించనున్నారు. 35 మందితో కూడిన సుందరీమణులతో కూడిన ఒక బృందం వరంగల్ నగరంలోని వేయిస్తంభాల ఆలయ నిర్మాణం, శిల్ప వైభవాన్ని, వరంగల్ కోటలో కాకతీయుల కీర్తి తోరణంతో పాటు శిల్పసంపదను పరిశీలిస్తుంది. అలాగే..
Operation Sindoor: కర్రెగుట్టల్లో మావోయిస్టుల వేటకు కాస్త విరామం పడింది. ఆపరేషన్ కగార్పై ఆపరేషన్ సింధూర్ ఎఫెక్ట్ పడింది. వెంటనే బార్డర్కు వెళ్లాల్సిందిగా సీఆర్పీఎఫ్ బలగాలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
Greyhounds jawans: ములుగు జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి ముగ్గురు గ్రేహౌండ్స్ జవాన్లు మృతిచెందారు. ఈ ఘటనతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.