Share News

Mulugu Police: తవ్వకాల్లో దొరికిన బంగారం కోసం ఘర్షణ.. రంగంలోకి దిగిన పోలీసులు

ABN , Publish Date - Nov 21 , 2025 | 11:30 AM

గుప్త నిధుల కోసం తొవ్వకాలు జరిపి.. భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. కానీ ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో ఘర్షణలు తలెత్తాయి. ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి పలువురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

Mulugu Police: తవ్వకాల్లో దొరికిన బంగారం కోసం ఘర్షణ.. రంగంలోకి దిగిన పోలీసులు

ములుగు, నవంబర్ 21: గుప్త నిధుల తవ్వకాల్లో భారీగా బంగారం లభించింది. దానిని పంచుకునే క్రమంలో వారి మధ్య విభేదాలు వచ్చాయి. దాంతో ఈ పంచాయితీ కాస్తా పోలీస్ స్టేషన్‌కు చేరింది. పోలీసులు రంగంలోకి దిగి.. ఐదుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటన ములుగు జిల్లాలో చోటు చేసుకుంది. ఆరు నెలల క్రితం కొందరు వ్యక్తులు బృందంగా ఏర్పడి.. మహారాష్ట్రలోని సిరిపంచ సమీపంలో ఒక ఇంట్లో గుప్త నిధల కోసం భారీ ఎత్తున తవ్వకాలు జరిపారు. ఈ సందర్భంగా రాగి బిందెను వారు వెలికి తీశారు. అందులో భారీ ఎత్తున బంగారం లభ్యమైంది.


దొరికిన ఆ బంగారాన్ని పంచుకునే క్రమంలో ఈ బృందంలోని సభ్యుల మధ్య విభేదాలు తలెత్తాయి. ఒకరికొకరు ఘర్షణకు దిగారు. ఈ పంచాయతీ పోలీసులకు చేరింది. వీరి నుంచి మొత్తం సమాచారాన్ని సేకరించేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. గుప్త నిధుల తవ్వకాల్లో దొరికిన రాగి బిందెపై పోలీసులు ఆరా తీశారు. ఈ తవ్వకాల్లో దొరికిన బిందెలో మొత్తం 36 బంగారం బిళ్లలు ఉన్నాయని పోలీసుల విచారణలో వెల్లడైనట్లు తెలుస్తోంది. ఒక్కో బిళ్ల 23 గ్రాముల బరువు ఉందని పోలీసులకు వారు వివరించినట్లు సమాచారం. దీనిపై పోలీసులు సమగ్ర విచారణ జరుపుతున్నారు.

ఈ వార్తలు కూడా చదవండి..

మావోయిస్టుల అరెస్టులో కీలకాంశాలు

బస్సు బోల్తా.. పలువురు ప్రయాణికులకు గాయాలు

For More TG News And Telugu News

Updated Date - Nov 21 , 2025 | 02:51 PM