పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పురపాలక సంఘాలు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వాటికి అందే ఆదాయ వనరులను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు.
జిల్లాలో చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ దీపక్ తివారితో కలిసి శనివారం జిల్లా అధికారులు, పంచాయతీ రాజ్, రహదారి భవనాల శాఖ, గిరిజన సంక్షేమ శాఖ ఇంజనీరింగ్ అధికారులు, ఎంపీడీవోలు, హౌసింగ్ ఇంజనీరింగ్ అధికారులు, గ్రామీణ ఉపాధి హామీ అధికారులు, మహిళా శిశు సంక్షేమ శాఖాధికారులు, ఎంఈవోలతో చేపట్టిన అభివృద్ధి పనులు, ఇందిరమ్మ ఇళ్ల పనుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకుల (ఫీల్డ్ అసిస్టెం ట్ల) కొరత ఏర్పడింది. జిల్లాలో 335 పంచాయతీల్లో కేవలం 160 మంది మాత్రమే పని చేస్తున్నారు. దీంతో కూలీలకు చేయూత కరవవుతోంది.
సన్ సిటి పరిధిలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. జ్వరంతో బాధపడుతున్న ఆరు నెలల శిశువు చికిత్స పొందుతూ మృతి చెందింది. వైద్యుల నిర్లక్ష్యంతోనే తమ బాబు ప్రాణాలు కోల్పోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు..
కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీపై కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను అవినీతిలో కింగ్ అన్నారని.. తనపై ఏ ఒక్క అవినీతి బయటపడినా స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు.
కేంద్ర ప్రభుత్వం అమెరికాతో ఇటీవల చేసుకున్న ఒప్పందాల వల్ల తెలంగాణ రైతులతో పాటూ దేశంలోని రైతులంతా తీవ్ర నష్టానికి గురయ్యే ప్రమాదం ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు అన్నారు..
రెండు తెలుగు రాష్ట్రాల డీసీసీ అధ్యక్షుల శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ఈ శిక్షణ డీసీసీ అధ్యక్షులకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు..
నల్గొండ జిల్లా నకిరేకల్ మున్సిపాలిటీ కేంద్రంలో శనివారం అగ్నిప్రమాదం జరిగింది. షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో భారీగా ఆస్తి నష్టం సంభవించింది..
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో ఇవాళ (శనివారం) విషాదకర ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడిన వ్యక్తి తీవ్ర గాయాలతో మృతిచెందాడు..
నాగర్ కర్నూల్ జిల్లాలోని కుమ్మెర గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. భక్తిశ్రద్ధలతో జరగాల్సిన మల్లన్న జాతరలో.. నిర్వాహకుల దురుసు ప్రవర్తన ఓ పసిప్రాణాన్ని బలితీసుకుంది. దైవ దర్శనం కోసం వెళ్లిన భక్తులపై నిర్వాహకులు జరిపిన దాడిలో మూడు నెలల పసిపాప ప్రాణాలు కోల్పోవడంపై స్థానికులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..