రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తూ అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.
పెరిగిన కోడి గుడ్ల ధరలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి. నెల కిందట గుడ్డు ధర రూ.6.50గా ఉంది. ప్రస్తుతం హోల్సేల్లో రూ.7.50వరకు పలుకుతోంది. చిల్లర ధర రూ 8కి విక్రయిస్తున్నారు. ప్రభు త్వ విద్యార్థులకు వారంలో మూడు సార్లు ఉడుకబెట్టిన గుడ్డు ఇవ్వాలనేది ప్రభుత్వ
సిర్పూర్ నియోజకవర్గ పరిధి లో చైన్ స్నాచింగ్ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నా యి. గతంలో గృహాలు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండు, రైల్వేస్టేషన్లను అడ్డగా మార్చుకొని చోరీలకు పాల్పడిన సంఘటనలు ఉండగా, ఇప్పుడు మాత్రం మహిళలను టార్గెట్ చేస్తూ మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లుతున్నారు.
పెంచికల్పేట మండలం చెడ్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ కె.హరిత బుధవారం తనిఖీ చేశారు. తరగతి గదుల్లో విద్యార్థులను ప్రశ్నించి వారి అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించారు. గుణాత్మక విద్యతో పాటు పోషకాహారం అందించాలని, కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తీసుకరావాలని ఆదేశించారు. విద్యార్థుల హాజరు శాతం పెంచేందుకు అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణలను మరింత మెరుగు పర్చడమే ధ్యేయంగా చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ హరిత అన్నారు. జ్రిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను అదనపు కలెక్టర్ యువరాజ్ మర్మాట్తో కలిసి సందర్శించి విద్యా ప్లస్ యాప్ పనితీరును పరిశీలించారు.
వర్షాకాలం సీజన్ ప్రారంభమై 45రోజులు గడిచి పోయినా జిల్లాలో లోటు వర్షపాతమే కనిపిస్తోంది. ఎల్నినో ప్రభావంతో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ మొత్తం వర్షాభావంతో ప్రతికూల వాతావరణం ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. జూలైలో రెండు వారాలు ముగిసినా వేసవి తీవ్రత తగ్గ లేదు. ఆకాశంలో మబ్బులు పట్టి అంతలోనే మాయమవుతున్నాయి. అక్కడక్కడా కొద్దిపాటి జల్లులు తప్ప భూములు పదునయ్యే స్థాయిలో వర్షం కురవడం లేదు. పైగా వేడిగాలులు వీస్తున్నాయి. మే నెలలో మేఘం మురిపించింది.
రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అభినందించారు. ఎల్ నినో లాంటి కరువు పరిస్థితుల్లోనూ ఏపీ ప్రభుత్వం రైతుల కోసం పని చేస్తుందన్నారు. పట్టిసీమ నుంచి రైతులకు నీళ్లు అందిస్తుందని వివరించారు.
విద్యాసంస్థల్లో డ్రగ్స్పై జీరో టాలరెన్స్ విధానం అమలు చేయాలని ఈగల్ విభాగంలోని అధికారులకు తెలంగాణ డీజీపీ సి.వి. ఆనంద్ స్పష్టం చేశారు. డ్రగ్స్ నిరోధించడంపై బుధవారం హైదరాబాద్లోని డీజీపీ కార్యాలయంలో ఈగల్ అధికారులతో సి.వి. ఆనంద్ ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
తెలంగాణలో పోక్సో చట్టం సమర్థవంతంగా అమలు చేయడానికి తక్షణం చర్యలు చేపట్టాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోరారు. ఈ మేరకు బుధవారం జనసేన పార్టీ తరఫున తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన లేఖ రాశారు.
తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) గడువును కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) పొడిగించింది. అందుకు సంబంధించిన షెడ్యూల్ను ఎన్నికల సంఘం బుధవారం సవరించింది.